Prabhas Fight: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం సలార్. ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించిన విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఇందులో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. కాగా సలార్ మూవీ వచ్చే నెలలో విడుదల కానుంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే పలువురు బాలీవుడ్ టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ సినిమా గురించి మరింత వివరంగా చెప్పడంతో ఈ సినిమా బాహుబలి సినిమా రికార్డులను మించి కలెక్షన్లను సాధిస్తుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సలార్ సినిమాతో ప్రభాస్ తన రికార్డులను తానే బద్దలు కొడతాడని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకం తెప్పించే ఒక అప్డేట్ వైరల్ అవుతోంది. సలార్ పాన్ వరల్డ్ మూవీ కాబోతుందట. ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే సినిమా అవుతుందట. అంతేకాకుండా ఇప్పటి వరకు ప్రభాస్ ది ఒక్క లెక్క, ఇకపై మరో లెక్క అంటున్నారు. కేజీఎఫ్ వంటి పాన్ ఇండియా సంచలన మూవీని తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాను రూపొందించడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇందులో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్ విలన్గా నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ సెప్టెంబర్ 28న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.
అలాగే ఈ సినిమా నుంచి ఓ క్రేజీ లీక్ వైరల్ అవుతోంది. అదేమిటంటే ప్రభాస్ సలార్ లో ద్విపాత్రాభినయం చేయబోతున్నారట. తండ్రి కొడుకులుగా కనిపిస్తారని సమాచారం. తండ్రి సలార్ అని తెలుస్తుంది. అంతేకాదు సినిమాలో ఒక అదిరిపోయే సీన్ ఉందట. యుద్ధభూమిలో వెయ్యి మంది విలన్లు ప్రభాస్ని చుట్టుముడితే అప్పుడు అసలైన సలార్ దిగుతాడని, అప్పుడు వచ్చే సీన్ సంచలనాత్మకంగా ఉంటుందని, ఆ సీన్ నెక్ట్స్ లెవల్ అని ఒక అభిమాని వెల్లడించారు. ఈ సన్నివేశాన్ని సలార్ షూటింగ్లో చూసినట్టు సదరు అభిమాని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఆ సన్నివేశం కోసం కోట్లు ఖర్చు చేస్తున్నారట. సినిమా మొత్తంలో అది హైలైట్ ఎపిసోడ్ అని, ఆ సీన్కి థియేటర్లలో ఫ్యాన్స్, ఆడియెన్స్ సీట్లో కూర్చొరని, పూనకాలతో ఊగిపోతారని అంటున్నారు.