Priyamani: ఆ విషయంలో ప్రియమణి అసంతృప్తిలో ఉందట.. అసలు విషయం ఇదే!

Priyamani: ఎలాంటి పాత్ర ఇచ్చిన అందులో ఒదిగిపోయే హీరోయిన్‌ ప్రియమణి ఆ విషయంలో సంతృప్తిలేనని చేసిన కామెంట్‌ చర్చానీయాంశంగా మారింది. పరుత్తివీరన్‌ సినిమాతో ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ప్రియమణి మొదటి సినిమాతోనే జాతీయ అవార్డును తన ఖాతాలో వేసుకుంది. తన అంద చందాలు నటనతో తెలుగు సినీ సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేసుకుంది. ప్రియమణి అందం చిరునవ్వు గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రియమణి నటించినా సినిమాలన్నీ దాదాపుగా సూపర్‌ హిట్లే. మొదట్లో డెట్స్‌ ఖాళీ ఉండని ప్రియమణికి ఇటీవల అవకాశాలు రానట్లు వార్తాలు వస్తున్నాయి. మంచి ఆఫర్లు రాకపోవడంతోనే పలు టీవీ షోలు, కొన్ని ప్రోగ్రామ్స్‌లో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది.

మరో విషయమేమిటంటే ఆమె ప్రేమించిన ముస్తఫారాజ్‌ ను వివాహం చేసుకున్న ప్రియమణి ఆ తర్వాత
సినిమాలో తన కెరియర్‌ అంత ఆశాజనకంగా కొనసాగలేదు. ప్రస్తుతం సరైన ఆఫర్‌ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరే అతగాడు సినిమాతో తెలుగు అరగ్రేటం చేసిన ప్రియమణి ‘పెళ్లయిన కొత్తలో’ తనదైన పాత్రలో ఒదిగిపోయి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాక పెద్ద పెద్ద హీరోలు బాలకృష్ణ, నాగార్జున సరసాన నటించింది. యమదొంగ సినిమా ప్రియమణి కెరియర్‌ను మలుపు తిప్పిందని చెప్పవచ్చు. ఆ సినిమాలో ధనికురాలు అయిఉండు కూడా కొన్ని పరిస్థితుల కారణంగా పేదింటి అమ్మాయిగా నడిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. అస్సలు వివాదాల జోలికి వెళ్లని ప్రియమణి నితిన్‌ నటించిన ద్రోణ సినిమాలో బికినీ వేసిన సీన్‌ అప్పట్లో హాట్‌ టాపిక్‌ గా మారింది.

ఎలాంటి పాత్ర ఇచ్చిన అందులో దూరిపోయే ముద్దుగుమ్మ నారప్ప సినిమాలోను తన పాత్రకు న్యాయం చేసింది. అయితే.. పెళ్లయిన తర్వాత ఇప్పటికీ కూడా హీరోయిన్‌గా కొనసాగించాలని భావిస్తున్న ప్రియమణి ఈ విషయంలో కాస్త అసంతృప్తితో ఉందని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ప్రియమణి ముందు కన్నా ఇప్పుడు ఇంకా అందంగా ఉంది.. బహుశా మనమిద్దరం కలిసి నటించే అవకాశం వస్తుందేమో చూద్దాం అంటూ అల్లు అర్జున్‌ చేసిన కామెంట్‌ చేశాడు. మంచి ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్న ప్రియమణికి అల్లుఅర్జున్‌తో నటించే అవకాశం వస్తే ఆమె సంతృప్తి చెందుతుందేమో అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -