RK Selvamani: రోజా మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మాట్లాడతాను.. సెల్వమణి ఆశ ఇక నెరవేరదేమో?

RK Selvamani: ఉమ్మడి చిత్తూరు జిల్లా నగరిలో వైసిపి వర్గ పోరు అధికమవుతుంది సాధారణంగా ఒక పార్టీకి వ్యతిరేక పార్టీ నుంచి విమర్శలు రావడం వారికి వ్యతిరేకత రావడం జరుగుతుంది కానీ నగరిలోని రాజకీయాలు మాత్రం చాలా విభిన్నమని చెప్పాలి. నగరిలో వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో నగరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నటి రోజాను గద్ద దించడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇలా నగరిలో రాజకీయ పోరు జరుగుతున్నటువంటి తరుణంలో రోజా భర్త డైరెక్టర్ సెల్వమణి స్పందించారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ పార్టీలో రోజాను వ్యతిరేకిస్తున్నటువంటి వారిది ఏ మాత్రం తప్పు కాదని తెలిపారు. అయితే వారిని ప్రోత్సహిస్తున్నటువంటి నాయకులదంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మమ్మల్ని నమ్మిన వారిని మేము ఎప్పుడూ మోసం చేయలేదని ఈయన తెలియచేశారు. శ్రీశైల పాలకమండలి చైర్మన్ పదవిని చక్రపాణి రెడ్డికి రోజా చెబితేనే దక్కిందని ఈయన తెలియజేశారు. అలాగే మున్సిపల్ మాజీ చైర్మన్ కేజే కుమార్ కుటుంబానికి మేము ఎంతో సహాయం చేశామని ఈయన గుర్తు చేసుకున్నారు. ఇలా మేము ఎందరికో సహాయం చేసామని ఇప్పుడు వారే మాపై తిరుగుబాటు చేస్తున్నారని వెల్లడించారు.

ఈ విధంగా మమ్మల్ని వ్యతిరేకించడంలో వీరి తప్పులేదు కానీ వీరి వెనుక ఉన్న నడిపిస్తున్నటువంటి నాయకులదే తప్పని ఈయన తెలియజేశారు. ఒకరు మా పై విమర్శలు చేస్తున్నారని మేము ఇతరులపై విమర్శలు చేయమని దేవుడనే వారు ఒకరు ఉన్నారు అంతా ఆయన్ని చూసుకుంటారని సెల్వమణి తెలిపారు. గత ఎన్నికలలో కూడా రోజు గెలవదని మాట్లాడారు అయితే ఆమె గెలిచింది మంత్రి పదవి రాలేదని హేళన చేశారు మంత్రి పదవి కూడా వచ్చిందని ఈయన తెలిపారు ఈసారి ఎన్నికలలో కూడా 175 స్థానాల్లో గెలిచే మొదటి స్థానం నగరి అని రోజా గెలపొందిన తర్వాతే తాను వ్యతిరేకులతో మాట్లాడతానంటూ ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -