Rohit Sharma: బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న భారత జట్టుకు కోలుకోలేని షాక్ తాకింది. ఇప్పటికే తొలి వన్డే ఓడిన బాధలో ఉన్న భారత్కు ఇది మరో ఎదురుదెబ్బ. టీమిండియా సారథి రోహిత్ శర్మ గాయపడ్డాడు. రెండో వన్డే సందర్భంగా రోహిత్ ఫీల్డింగ్ చేస్తుండగా అతడి వేలికి గాయమైంది. దీంతో అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రోహిత్ శర్మ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు.
బంగ్లా ఇన్నింగ్స్ సందర్భంగా మహ్మద్ సిరాజ్ వేసిన రెండో ఓవర్ లో మొదటి రెండు బంతులను అనమోల్ హక్ బ్యాక్ టు బ్యాక్ బౌండరీలు బాదాడు. ఆ తర్వాత బంతికి రెండు పరుగులొచ్చాయి. నాలుగో బంతికి అనమోల్ ఇచ్చిన క్యాచ్ ను అందుకునేందుకు రోహిత్ యత్నించాడు.
Update: India Captain Rohit Sharma suffered a blow to his thumb while fielding in the 2nd ODI. The BCCI Medical Team assessed him. He has now gone for scans. pic.twitter.com/LHysrbDiKw
— BCCI (@BCCI) December 7, 2022
బంతిని అందుకునే క్రమంలో రోహిత్ చేతి వేలికి గాయమైంది. వేలి నుంచి రక్తం కారడంతో హిట్మ్యాన్ ఫిజియో సలహాతో డగౌట్ కు చేరాడు. అతడి స్థానంలో రజత్ పాటిదార్ ఫీల్డింగ్ కు వచ్చాడు.గాయం తీవ్రత పెద్దది కావడంతో రోహిత్ ను వెంటనే ఆస్పత్రికి తరలించి స్కానింగ్ తీశారు. ప్రస్తుతం అతడి పరిస్థితి ఎలా ఉందనే విషయమై బీసీసీఐ ఇంకా సమాచారం అందించాల్సి ఉంది.
ఈ మ్యాచ్ కు ముందు రోహిత్ శర్మతో పాటు టీమిండియా యువ బౌలర్ కుల్దీప్ యాదవ్ కూడా గాయంతో ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో ఉమ్రాన్ మాలిక్ ఈ మ్యాచ్ లో ఆడుతున్నాడు. భారత్-బంగ్లాదేశ్ మధ్య ముగిసిన తొలి మ్యాచ్ లో బంగ్లా ఒక్క వికెట్ తేడాతో గెలిచిన విషయం తెలిసిందే.