Sai Dharam Tej: ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకొనే ప్రయాణం చేయండి!

Sai Dharam Tej: మెగా కాంపౌండ్ నుంచి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ క్రమంలోనే మెగా మేనల్లుడిగా సాయిధరమ్ తేజ్ అనంతరం వైష్ణవ్ తేజ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన వైష్ణవ్ మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు పొందారు. అనంతరం ఈయన నటించిన కొండ పొలం పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది. తాజాగా గిరీషయ్యా దర్శకత్వంలో వైష్ణవ్ నటించిన రంగ రంగ వైభవంగా సినిమా ఈనెల రెండవ తేదీ విడుదల కానుంది.

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాదులో ఎంతో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి అతిథిగా పాల్గొన్న సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ వేదికపై మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరి నేను ఇక్కడ ఇలా అందరిని చూస్తానని అందరితో మాట్లాడతానని అనుకోలేదు. ఇలా ఇక్కడ నిలబడి ఉన్నానంటే నిజంగా అది నా అదృష్టమని ఎమోషనల్ అయ్యారు.

ఇక సినిమా గురించి మాట్లాడుతూ చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ తెలియజేసిన సాయి ధరమ్ తేజ్ అనంతరం తన తమ్ముడు వైష్ణవ్ తేజ్ గురించి మాట్లాడారు. 2021 లక్కీ ఇయర్ వైష్ణవ్ ఉప్పెన సినిమా విడుదల కావడం ఆ తనని హీరోగా అందరూ యాక్సెప్ట్ చేసినందుకు చాలా థాంక్స్ అంటూ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇక నా సినిమా రిలీజ్ కి ముందు యాక్సిడెంట్ అయింది అసలు ఏం జరుగుతుందో నాకు తెలియదు తమ్ముడు అన్న అని పిలవడం మాత్రమే గుర్తుంది అంటూ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.

వైష్ణవ్ అన్నా అని పిలుస్తున్న పలకలేక పోయాను. తమ్ముడు అమ్మానాన్న అందరం కలిసి ఉంటే ఎంతో బాగుంది ఇలా కలిసి ఉండటమే నాకు ధైర్యాన్ని ఇచ్చింది వాళ్లే నా బలం. సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనే విషయం పక్కన పెడితే మీరు వైష్ణవ్ ను హీరోగా యాక్సెప్ట్ చేశారు అదే చాలు. ఈ విషయంలో చాలా హ్యాపీగా ఉంది అని ఈయన తన తమ్ముడి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు అయితే తానేమి 90 వేయలేదు తనకు తాగే అలవాటు లేదనీ తెలిపారు. అక్కడ ఇసుక ఉండడం నా తప్పుకాదు కనుక ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకుని బైక్ డ్రైవ్ చేయండి అదే నన్ను ఈ రోజు ప్రాణాలతో నిలబెట్టింది అంటూ ఈయన యాక్సిడెంట్ గురించి కూడా తెలిపారు. ఇక ఈ సినిమాని పవర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయడంతో ప్రతి ఒక్కరూ సినిమా చూసి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు జరుపుకోమని ఈ సందర్భంగా ఈయన రంగ రంగ వైభవంగా ప్రీ రిలీజ్ వేడుకలో ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -