Ex CM Son: ప్రస్తుత కాలంలో మహిళలపై వేధింపులు అధికమయ్యాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు కూడా ఇలా వేధింపులకు పాల్పడటం గమనార్హం.ప్రజా ప్రతినిధులు ప్రజారక్షణ కోసం పని చేయాల్సిన రాజకీయ నాయకులు ఇలా మహిళల పట్ల వేధింపులకు పాల్పడుతున్నటువంటి తీరు అన్ని రాష్ట్రాలలోనూ జరుగుతుంది. తాజాగా ఇలాంటి ఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చింది. తమిళనాడు మాజీ సీఎం ఫన్నీర్ సెల్వం కుమారుడు అన్నాడీఎంకే నేత, థేనీ ఎంపీ రవీంద్రనాథ్ ఇలాంటి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.
రవీంద్రనాథ్ పై ఓ మహిళ తమిళనాడు డిజిపి కి ఫిర్యాదు చేశారు. గత ఏడాది అక్టోబర్ నెల నుంచి రవీంద్రనాథ్ తనని వేధింపులకు గురి చేస్తున్నారని తెలిపారు.ఆయన తరచూ ఫోన్లు చేస్తూ తన కోరిక తీర్చాలని నన్ను వేధిస్తున్నారని అలాగే న్యూడ్ వీడియో కాల్స్ చేయాలి అంటూ తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈమె రవీంద్రనాథ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాను చెప్పినట్లుగా నడుచుకోకుండా తనకు లొంగకుండా ఉంటే తనని చంపేస్తానని బెదిరింపులకు కూడా రవీంద్రనాథ్ పాల్పడుతున్నారని మహిళ డీజీపీకి ఫిర్యాదు చేశారు. అయితే గతంలో ఈయన పట్ల తాను
తాంబారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని సదరు మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే డిజిపి తన ఫిర్యాదును పరిగణలోకి తీసుకొని విచారణ చేపడతామని తెలిపారు.ఈ విధంగా ప్రజాప్రతినిధులు ఇలా మహిళల పట్ల ఈ విధమైనటువంటి వేధింపులకు పాల్పడుతున్నటువంటి తరుణంలో ఇక రాష్ట్ర ప్రజల రక్షణ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు అని పలువురు ఈ విషయం పై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.