YCP: వైసీపీ మాస్టర్ ప్లాన్ తో ఆ ఎంపీకి షాక్ తప్పదా.. ఏం జరిగిందంటే?

YCP: ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఏపీలో రాజకీయాలు మరింత వేడిగా మారుతున్నాయి. అంతేకాకుండా ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది వైసీపీలో లుకలుకలు ఎక్కువ అవుతున్నాయి. నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయుల్ని పార్టీ నుంచి పంపేయాలని దాదాపుగా నిర్ణయిచుకున్నారు. అందుకోసం ప్రణాళిక ప్రకారం ప్రచారం కూడా ప్రారంభించారు. చైతన్య విద్యా సంస్థల యజమాని బీఎస్ రావు కుటుంబాన్ని పరామర్శించేందుకు లోకేష్ వెళ్లినప్పుడు ఎదురుగా ఎంపీ లావు వచ్చారు.

ఆయనతో లోకేష్ కరచాలనం చేశారు. దాంతో ఆ ఫోటో పట్టుకుని వారిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకున్నారంటూ ప్రచారం చేయడం ప్రారంభించారు. ఆయన పార్టీ మారిపోతారని వచ్చే నెలలో ఒక తేదీ కూడా ఫిక్స్ చేశారు. వైసీపీలో లావు కృష్ణదేవరాయులు కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్నారు. ఆయన నియోజకవర్గం పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు ఆయనతో సఖ్యతగా లేరు. ముఖ్యంగా మంత్రి విడదల రజనీ ఆయనపై కారాలు మిరాయాలు నూరుతున్నారు. హైకమాండ్ కు చాలా తెలిపారు.. ఆయన నర్సారావుపేట పార్లమెంట్ పరిధిలో ఉన్న చిలుకలూరిపేటకు వెళ్లినా ప్రొటోకల్ మర్యాదలు కూడా దక్కటం లేదు. అసలు రావొద్దని అంటున్నారు.

 

ఆ ఒక్కటే కాదు అన్ని నియోజకవర్గాల్లో అదే పరిస్థితి. ప్రోటోకాల్ దక్కడంలేదని నేరుగా జగన్ కి చెప్పుకున్న పరిస్థితి మెరుగుపడలేదు. దాంతో ఆయనపై జగన్ కూడా ఆసక్తి లేదన్న వాదన వినిపిస్తోంది. లావు కృష్ణ దేవరాయులు. ఇప్పటికే టీడీపీ అధిష్టానం టచ్ లో ఎంపీ ఉన్నారని వైసీపీ నేతలు చేసిన ప్రచారాన్ని టీడీపీ సోషల్ మీడియా ఎత్తుకుది. గుంటూరు ఎంపీగా టీడీపీ పార్టీ నుంచి రెండవ సారీ విజయం సాధించిన గల్లా జయదేవ్ సైలెంట్ అయ్మారు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. పార్టీ కూడా జయదేవ్ స్థానంలో మరో అభ్యర్థి కోసం చూస్తోంది. ఆ అభ్యర్థి లావు అవుతారని అంటున్నారు. కానీ గల్లా జయదేవ్ కాకపోతే అలాంటి పొటెన్షియల్ ఉన్న అభ్యర్థులు చాలా మంది ఉన్నారని టీడీపీ నేతలు అంటున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -