Sharmila: ఏపీ పరిస్థితిని ఒక్కమాటలో చెప్పిన షర్మిళ.. వేస్ట్ పాలనంటూ?

Sharmila: ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా కూడా వైసీపీ ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏపీకి ఒక ఇండస్ట్రీ రాలేదని ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదని ఇంతవరకు కనీసం రాజధాని ఏది అనేది కూడా తెలియకుండా ఉంది అంటూ చాలామంది విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే విషయం గురించి టీడీపీ నాయకులు టీడీపీ అభ్యర్థి చంద్రబాబు నాయుడు ఇప్పటికే చాలాసార్లు విమర్శించిన విషయం తెలిసిందే. టీడీపీ ప్రభుత్వం గురించి పక్కన పెడితే గత కొద్ది రోజులుగా వైయస్ షర్మిల వైసీపీ ప్రభుత్వం పనితీరును ఎండగట్టడమే పనిగా పెట్టుకుంది.

ఏపీ ప్రభుత్వం గురించి జగన్ చేసిన అభివృద్ధిని గురించి ఆమె మాట్లాడుతూ నిత్యం ఆయనపై విమర్శలు గుర్తిస్తూనే ఉంది షర్మిల. తాజాగా కూడా ఆమె తనకు ఎదురైన ఒక అనుభవం గురించి చెప్పుకొచ్చింది. నేను ఒకసారి బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు నా పక్కన ఒక ముసలావిడ ఉంది. ఆమెతో నేను వైసీపీ ప్రభుత్వం గురించి అడిగాను. అప్పుడు ఆమె నాకు కొడుకు ఉన్నాడు ఆ కొడుకు బాగా చదువుకున్నాడు. జగన్ వచ్చిన తర్వాత ఉద్యోగం వస్తుందని అనుకున్నాము కానీ ఉద్యోగం రాలేదు. పోనీ మా ఆయన ఏదైనా సంపాదిస్తాడా అనుకుంటే జగన్ ఇచ్చిన డబ్బులతో రోజు తప్ప తాగి ఇంటికి వచ్చేస్తున్నాడు అని ఆమె బాధపడింది.

 

అదేంటమ్మా సీఎం జగన్ గారు మద్యం బ్యాన్ చేస్తానని చెప్పారు కదా అమ్మ అనడంతో లేదమ్మా అంటూ ఆమె నాతో ఆవేదన వ్యక్తం చేసింది అని చెప్పుకొచ్చింది షర్మిల. ఇలా ఉంది ఏపీలో పనితీరు..ఏమైనా అడిగితే అభివృద్ధి చేద్దామని అంటున్నారు ఏమి అభివృద్ధి చేశారు. ఇన్ని రోజులకు కాను ఒక పరిశ్రమ తీసుకు వచ్చారా లేదంటే రాజధాని నెలకొల్పారా, ఒక మెట్రో స్టేషన్ కట్టించారా. చిన్న చిన్న రాష్ట్రాల్లోనే మెట్రో ఉన్నాయి కానీ మన విజయవాడలో ఏపీలో ఎక్కడ చూసినా కూడా మనకు మెట్రో ఎక్కడా లేదు. ఐదేళ్ల ప్రభుత్వంలో మీరు చేసిన అభివృద్ధి ఏమిటో అర్థం కావడం లేదు ఆ అభివృద్ధి ఏమిటో నాకు చూపించండి. అభివృద్ధి కోసం ఏపీ ప్రజలు కళ్ళలో ఒత్తులు వేసుకొని మరీ ఎదురుచూస్తున్నారు. అభివృద్ధి చేస్తే చూడాలని వారు కూడా కోరుకుంటున్నారు అంటూ ఏపీ ప్రభుత్వంపై వైయస్ జగన్ పై విమర్శలు గుప్పించింది షర్మిల. ఈ సందర్భంగా ఆమె మాట్లాడిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -