Sharmila: పులిబిడ్డలా సవాల్ విసిరిన షర్మిల.. అలా కామెంట్లు చేస్తూ?

Sharmila:వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల శనివారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఇలా ఖమ్మం జిల్లాలో పర్యటించినటువంటి ఈమె పాలేరులో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా షర్మిల మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసిరారు.తాను గతంలో చెప్పిన విధంగానే పాలేరు నుంచి ఎన్నికల బరిలో దిగుతున్నానని ఇక్కడ విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెడతానని షర్మిల తెలిపారు.

ఇదే పాలేరు మట్టి సాక్షిగా తాను శపథం చేస్తున్నాను.. పాలేరు ప్రజలకు వైయస్సార్ సంక్షేమ పాలన అందిస్తానని షర్మిల తెలియజేశారు.రైతులకు అండగా నిలబడటమే కాకుండా ఇల్లు లేని పేదవారికి ఇల్లు కట్టిస్తానని అలాగే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ పథకాలన్నింటిని అందిస్తానని తిరిగి రాజన్న పాలను తీసుకువస్తానని ఈమె మాట ఇచ్చారు.

 

ఇలా వచ్చే ఎన్నికలలో తాను పోటీ దిగి కచ్చితంగా గెలుస్తానని తెలిపారు. అయితే కొందరు తనని ఓడించాలని ఎన్నో పథకాలు రచిస్తున్నారని షర్మిల తెలిపారు.ఇలా నా ఓటమిని చవిచూడాలనుకున్న వారికి తాను ఒకటే సవాల్ విసిరుతున్నాను దమ్ముంటే నన్ను ఓడించి చూడండి అంటూ ఈమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

 

మళ్లీ చెబుతున్న నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను.. పులి కడుపున పులే పుడుతుంది.మీ బిడ్డగా మీ అందరి సంక్షేమం కోసం సేవ చేస్తా అంటూ ఈ సందర్భంగా పాలేరు నియోజకవర్గంలో షర్మిల చేసినటువంటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు తాను 3800 కిలోమీటర్ల పాదయాత్ర చేశానని త్వరలోనే పాదయాత్ర ప్రారంభించి 4000 కిలోమీటర్ల పాదయాత్రను పాలేరు నియోజకవర్గం లోని పూర్తి చేస్తాను అంటూ ఈ సందర్భంగా షర్మిల చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -