Y. S. Sharmila: తెలంగాణలో వైసీఆర్టీపీ పార్టీ పెట్టిన షర్మిల పాదయాత్ర పేరుతో రాష్ట్రమంతా తిరుగుతున్నారు. దోపిడి దొరల పాలనలో రాష్ట్రం చిక్కుకొని పోయిందని పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. కాళేశ్వరం సహా పలు ప్రాజెక్టుల్లో లక్షల కోట్ల అవినీతి కేసీఆర్ కుటుంబం చేసిందని అంటున్నారు. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు జగన్ పై ఒక్క కేసు లేదని స్పష్టం చేశారు.
తెలంగాణలో రాజన్న రాజ్య స్థాపనే లక్ష్యంగా ప్రజల్లో తిరుగుతున్నారు వైసీఆర్టీపీ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల. అధికార బీఆర్ఎస్ పార్టీపై ప్రతి చోటా విరుచుకుపడుతున్నారు. ప్రధానంగా నీటి ప్రాజెక్టుల్లో రీ డిజైన్ పేరుతో లక్షల కోట్లు కల్వకుంట్ల కుటుంబం దోచుకుందని షర్మిల ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కూడా ఫిర్యాదు చేశారు. పాదయాత్రలో అధికార పార్టీ ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలకు కూడా పలుమార్ల షర్మిల అరెస్ట్ అయ్యారు.
తాజాగా అన్న సీఎం జగన్ గురించి మాట్లాడిన షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబం లాగా రాజశేఖర్ రెడ్డి కుటుంబం ఎక్కడా దోపిడి చేయలేదని స్పష్టం చేశారు. తనపై ఎక్కడా ఆరోపణలు రాలేదన్నారు. రాజశేఖర్ రెడ్డి బతికున్నంత వరకు జగన్ పై కేసులు ఉన్నాయని అని షర్మిల ప్రశ్నించారు. కేవలం సోనియా గాంధీని వ్యతిరేకించటంతోనే కేసులు బనాయించాని ఆవేదన వ్యక్తం చేశారు. తన అన్నపై రాజకీయ కక్షతోనే కేసులు పెట్టారని షర్మిల చెప్పింది.