Pooja Hegde: బెస్ట్ హీరోయిన్ అవార్డు పూజా డబ్బులు ఇచ్చి గెలుచుకుంది అంటూ నెటిజన్లు ట్రోల్స్!

Pooja Hegde: టాలీవుడ్ ప్రేక్షకులకు స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో ఎన్నో సినిమాలో నటించి నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇక తన అందంతో ఎంతోమంది అభిమానులు ఆకట్టుకుంది ఈ అమ్మడు. ఇక పూజ ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉంది. ఈ క్రమంలో పూజా హెగ్డే పాన్ ఇండియా సినిమాల్లో మొదటి ఛాయిస్ గా మారింది.

ఇక తాజాగా సైమా అవార్డులో పూజా హెగ్డే బెస్ట్ హీరోయిన్ అవార్డును తన సొంతం చేసుకుంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రానికి గాను పూజ ఈ అవార్డును తన సొంతం చేసుకుంది. కానీ పూజా కి ఇది గర్వపడాల్సిన విషయమైనప్పటికీ నెటిజన్లు పూజా ను ఒక రేంజ్ లో దెప్పి పొడుస్తున్నారు. ఆ అవార్డు ను పూజ డబ్బులు పెట్టి తెచ్చుకుందని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఇక ట్రోల్స్ చేయడానికి కూడా ఒక కారణం ఉంది. అదేమిటంటే బెస్ట్ హీరోయిన్ నామినేషన్స్ లో పూజా హెగ్డే తో పాటు సాయి పల్లవి కూడా ఉంది.

లవ్ స్టోరీ.. హీరో నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాల్లో పాత్రలకు గాను సాయి పల్లవి బెస్ట్ హీరోయిన్ గా నామినేట్ అయింది. నిజానికి ఈ రెండు చిత్రాల్లో సాయి పల్లవి పర్ఫామెన్స్ మరో స్థాయిలో ఉంది. ఈ రెండు సినిమాల్లో అంతటి నటనను కనబరిచిన సాయి పల్లవిని వదిలేసి.. కేవలం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో హీరోయిన్ గా నటించిన పూజకు ఎలా అవార్డు ఇస్తారని నెటిజన్లు సోషల్ మీడియా రూపంలో ప్రశ్నిస్తున్నారు.

నిజానికి పూజ హెగ్డే ఈ సినిమాలో ఒక నార్మల్ అమ్మాయిగా క్యారెక్టర్ చేసింది. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న నెటిజన్లు పూజ హెగ్డే పై ఒక రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు. పూజకు ఇది ఆనందపడే సమయం అయినప్పటికీ ఏ మాత్రం సుఖం లేకుండా పోయింది. ఇక ఈ విషయం గురించి పూజ హెగ్డే ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -