Sunitha: జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరనన్న సునీత…

Sunitha: రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వరుస పెట్టి సొంత పార్టీ నాయకులు, సొంత చెల్లెలు ఇలా అందరూ షాపులు ఇస్తూ వేరే పార్టీలో చేరిపోతున్నారు. ఇప్పటికే జగన్ సొంత చెల్లెలు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించడంతో జగన్మోహన్ రెడ్డి కంగుతున్నారు. మా కుటుంబాల మధ్య కావాలని చిచ్చు పెడుతున్నారని బహిరంగ సభల వేదికగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరో చెల్లెలు చిన్నాన్న కూతురు వైయస్ సునీత కూడా జగన్ కి షాక్ ఇవ్వనున్నారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డి గొడ్డలి పోటుతో హత్య చేయబడ్డారు. ఈ సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈ విషయాన్ని అడ్డంపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి సింపతీ పొంది 2019 ఎన్నికల్లో వాడుకునీ అధికారంలోకి వచ్చారు.అయితే చిన్నాన్న చంపింది ఎవరు తెలియకుండానే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పైన ఆరోపణ చేశారు.

 

తన తండ్రిని చంపిన వారు ఎవరో తేల్చాలని సునీత న్యాయపోరాటానికి దిగారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ విషయాన్ని అసలు పట్టించుకున్న దాఖలాల లేవు జరం చేతులు అధికారం ఉంది కాబట్టి తను చిన్నాన్న చంపింది ఎవరూ ఇట్టే తెల్చవచ్చు. అయితే ప్రజలందరికీ తెలుసు వైయస్ వివేకానంద రెడ్డి హత్య వెనకాల ఉన్నది జగన్మోహన్ రెడ్డి, వైయస్ అవినాష్ రెడ్డి అని. ఈ విషయాన్ని సునీత ప్రస్తావిస్తూ న్యాయపోరాటానికి దిగగా అన్ని విధాల అడ్డుకోవడానికి జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు పన్నారు.

 

అయితే సునీత మాత్రం ఎక్కడా వెనకడుగు వేయకుండా న్యాయస్థానానికి వెళ్లి ఈ కేసును తెలంగాణలో సిబిఐకి అప్పగించారు. వైఎస్ అవినాష్ రెడ్డి ఈ హత్యలో కీలకపాత్ర పోషించారని సిబిఐ తేల్చి చెప్పింది. విచారణకు రావాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే వైయస్ అవినాష్ ను వెనక ఉండి చేయించింది… కేసుల్లో చిక్కుకోకుండా కాపాడుతుంది ఎవరో కూడా తెలుసు.
అయితే ఇప్పుడు సునీత జగన్మోహన్ రెడ్డికి మరో షాపు ఇవ్వనున్నారు తాను న్యాయపోరాటాన్ని మరింత విస్తృతం చేసేందుకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. షర్మిల తరహాలో కాంగ్రెస్ పార్టీలో చేరి చట్టసభల్లోకి వెళ్లాలనుకుంటున్నారు. ఇది జగన్ కి కొత్త తలపోటుగా మారుతుంది అనడం ఎటువంటి సందేహం లేదు. సిబిఐ కనుక దర్యాప్తు వేగవంతం చేస్తే వైయస్ వివేకానంద హత్య వెనకాల ఉన్న ప్రతి ఒక్కరు బయటకు వస్తారు. తన తండ్రిని హత్య చేయించింది ఎవరో బయటపడేంత వరకు కూడా సునీత తగ్గేదే లేదని చెప్పారు.

Related Articles

ట్రేండింగ్

YSR Cheyutha Scheme: డబ్బులన్నావ్.. డబ్బాలు కొట్టుకున్నావ్.. చేయూత నాలుగో విడత జమయ్యాయా జగన్?

YSR Cheyutha Scheme: జగన్మోహన్ రెడ్డి ఇటీవల తన ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన సంగతి తెలిసిందే .ఈ మేనిఫెస్టోలో భాగంగా ఈయన గత ఐదు సంవత్సరాల కాలంలో ఏ సామాజిక వర్గానికి...
- Advertisement -
- Advertisement -