Adipurush: ఆదిపురుష్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. టికెట్లు ఫ్రీగా ఇస్తారట!

Adipurush: టాలీవుడ్ హీరో పవన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టులలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ అదే ఊపుతూ వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టులలో నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ నటించిన తాజా చిత్రం ఆది పురుష్. ఈ సినిమా గత ఏడాది విడుదల కావాల్సి కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూనే వస్తోంది. అయితే ఎట్టకేలకు ఈ సినిమాను జూన్ లో విడుదల చేయడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేశారు.

ఈ మధ్యకాలంలో ఈ సినిమాకు సంబంధించి తరచూ ఏదో ఒక వివాదం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. తాజాగా ఈ సినిమా టికెట్స్ విషయంలో ఈ సినిమాపై ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఫ్యాన్స్‌ కోసం సినిమా టీమ్‌ ఆఫర్‌ను ప్రకటించింది. అదే ఒక టికెట్‌ కొంటే మరొకటి ఉచితం. అయితే దీనికి కొన్ని షరతులు కూడా ఉన్నాయి. పేటీఎం ద్వారా ఈ ఛాన్స్‌ పొందవచ్చు. అయితే ఒక టికెట్‌ కొంటే దాంతోపాటు మరో టికెట్‌ ఇస్తారని కాదు. జూన్‌ 30 వరకే ఉంటే ఈ ఆఫర్‌ కాస్త వెరైటీగా ఉంది అని చెప్పొచ్చు. డీల్‌ రూపంలో ఇచ్చిన ఈ ఆఫర్‌ను పొందాలంటే రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.

రూ. 100 చెల్లించాక ఓ ప్రోమో కోడ్‌ వస్తుంది. ఆ తర్వాత పేటీఎంలో టికెట్‌ బుక్‌ చేసుకునే ముందు ఆ కోడ్ అప్లై చేయాల్సి ఉంటుంది. అప్పుడు టికెట్‌ ప్రాసెస్‌ పూర్తయ్యాక రూ. 400 వరకు క్యాష్‌ బ్యాక్‌ వస్తుంది. అయితే కనీసం రూ. 350 ధర ఉన్న టికెట్‌ కొంటేనే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. అలా ఒక టికెట్‌ కొంటే ఆ టికెట్‌ డబ్బులు వెనక్కి వస్తాయన్నమాట. ఈ లెక్కన రెండు టికెట్లు బుక్‌ చేయాల్సి వస్తే ట్యాక్స్‌లు అన్నీ కలిపి రూ.700కిపైగా అవుతుంది. అప్పుడు పేటీఎం డీల్‌ ఆఫర్‌ కోడ్‌ని ఉపయోగిస్తే ఒక టికెట్‌ కొంటే మరో టికెట్‌ ఫ్రీగా వచ్చినట్లే అని చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -