Chandrababu: ఏపీలో తొందరలోనే రాష్ట్రస్థాయిలో ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది అనగా 2024 లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇక 2019లో ఎన్నికైన వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సీఎం గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే కొందరు జగన్ మంచి చేశాడు అంటే మరికొందరు చెడు చేశారని, కామెంట్స్ చేస్తున్నారు. మధ్య తరగతి వాళ్ళు అయితే నిత్యవసర సరుకుల విషయంలో జగన్మోహన్ రెడ్డి రేట్లను భారీగా పెంచాడని, దానికి తోడు పెట్రోల్ డీజిల్ బంగారం లాంటి ప్రతి ఒక్క వస్తువుపై భారీగా ధరలు పెంచేసాడని మళ్లీ పడుతున్నారు.
దీంతో ప్రస్తుతం ఏపీలో ప్రజల భవిష్యత్తులో బాగుండాలి అంటే వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలలో కచ్చితంగా బాబు రావాలి బాబు వస్తే పరిస్థితిలో మారుతాయి అని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చాలా వరకు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఏడాది బాబు ఎలా అయినా కచ్చితంగా గెలవాలని కోరుకుంటున్నారు. ఏపీ ప్రజల బ్రతుకు మారాలంటే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా చంద్రబాబు సీఎం అయితే ప్రజల్లో, ప్రజల బ్రతుకుల్లో మార్పువస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రైతులకు, విద్యార్థులకు, మహిళల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టినప్పటికీ నిత్యవసర సరుకులు పెట్రోల్ డీజిల్, ధరలు,బంగారాలు గ్యాస్ ఇలా ప్రతి ఒక్కదానిపై రేట్లు భారీగా పెంచేశారని మండిపడుతున్నారు. అంతేకాకుండా ఉద్యోగస్తుల జీతాలు కూడా సరిగా ఇవ్వడం లేదని ఈ బాధలన్నీ విముక్తి అవ్వాలి అంటే వచ్చే ఎన్నికల్లో ఎలా అయినా బాబు గెలవాలి అని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.