Bigg Boss Season 6: జంటలా బిగ్ బాస్ లోకి మరో స్టార్ కపుల్స్.. ఎవరంటే?

Bigg Boss Season 6: బుల్లితెరపై ప్రసారమయ్య అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సీజన్ 6 మరి కొద్ది రోజులలో ప్రసారం కానుంది. ఈ కార్యక్రమం కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉన్నారు.ఇకపోతే బిగ్ బాస్ నిర్వాహకుల సైతం ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయగా ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక్కొక్క అప్డేట్ విడుదల చేస్తూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం పై అంచనాలు పెంచుతున్నారు.ఇప్పటికే ఈ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్ల గురించి అభిమానులలో పెద్ద ఎత్తున ఆత్రుత నెలకొంది.

ఇక ఈ కార్యక్రమం సెప్టెంబర్ 4వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి ప్రసారం కాబోతుందని తెలియడంతో ఈ కార్యక్రమంలో పాటిస్పేట్ చేసే కంటెస్టెంట్లు ఎవరు అనే విషయం గురించి పెద్ద ఎత్తున ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి కొందరి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ సీజన్ మరో లెవల్ లో ఉండబోతుందని భావిస్తున్నారు. ఇకపోతే ఎప్పటిలాగే ఈ కార్యక్రమానికి ప్రముఖ సింగర్లను తీసుకొచ్చే విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ సీజన్లో కూడా సింగర్స్ పాల్గొనబోతున్నారని, అలాగే గతంలో హీరో వరుణ్ సందేశ్, వితిక జంటను కంటెస్టెంట్లుగా పంపించినట్టు ఈ సీజన్లో కూడా స్టార్ సింగర్స్ హేమచంద్ర శ్రావణ భార్గవి జంటను బిగ్ బాస్ హౌస్ లోకి పంపించబోతున్నట్లు సమాచారం. వీరిద్దరూ సింగర్స్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక హేమచంద్ర తాజాగా ప్రసారమైన సూపర్ సింగర్ జూనియర్స్ కార్యక్రమంలో జడ్జిగా వ్యవహరించారు.

ఇకపోతే శ్రావణ భార్గవి సింగర్ గా మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇలా వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారని గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ఈ దంపతులు పూర్తిగా ఖండించారు.ఈ వివాదం అనంతరం శ్రావణ భార్గవి అన్నమయ్య కీర్తనలను తన వ్యక్తిగత వీడియో గా ఉపయోగించుకోవడంతో పెద్ద ఎత్తున ఈమెపై విమర్శలు ఎదురయ్యాయి.ఈ క్రమంలోనే ఈ జంట బిగ్ బాస్ ఎంట్రీ ఇవ్వనున్నారు అని తెలియడంతో ఈ కార్యక్రమం పై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

YS Sharmila: జాబు రావాలంటే జగన్ పోవాలి.. వైరల్ అవుతున్న షర్మిల సంచలన వ్యాఖ్యలు!

YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నవ సందేహాలు పేరిట వైయస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగంగా లేఖ రాశారు ఈ లేఖ ద్వారా గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన...
- Advertisement -
- Advertisement -