Sharmila: జగనన్న వల్లే ఇలాంటి పరిస్థితి.. షర్మిల సంచలన వ్యాఖ్యలు!

Sharmila: గురువారం కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. జగనన్న తీరు వల్లే వైయస్సార్ ఫ్యామిలీ చీలిపోయిందని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి అయ్యాక జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మారిపోయారని చెప్పిన షర్మిల కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని, తమ కుటుంబాన్ని చీల్చిందని పెద్దపెద్ద మాటలు మాట్లాడారు జగనన్న గారు నిజానికి ఆంధ్ర రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా దీనస్థితిలో ఉంది అంటే అందుకు కారణం జగనన్న, చంద్రబాబు.

 

ఇవాళ మా కుటుంబం చీలిపోయిందంటే అది జగనన్న చేజేతులా చేసుకున్నది. దీనికి సాక్ష్యం దేవుడు, దీనికి సాక్ష్యం నా తల్లి, దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం అని వైయస్ షర్మిల చాలా ఆవేశంగా చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇబ్బందుల్లో ఉంటే 18 మంది రాజీనామాలు చేసి జగన్ అన్నగారి వైపు నిలబడ్డారు. అధికారంలోకి వచ్చాక మంత్రులను చేస్తాను అన్నారు ఇవాళ వాళ్లలో ఎంతమంది మంత్రులుగా ఉన్నారు.

వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మ, నేను వాళ్ళ కోసం తిరిగి, వాళ్ళ గెలుపు కోసం పాటుపడ్డాం వైసీపీ కష్టాల్లో ఉందని నన్ను పాదయాత్ర చేయమన్నారు, నా ఇంటిని పిల్లలని పక్కనపెట్టి ఎండనక వాననకా రోడ్లమీదనే ఉన్నాను. ఆ తరువాత సమైక్య యాత్ర కోసం అడిగితే ప్రజలు బాగు కోసమే కదా అని ఆ యాత్ర కూడా చేశాను. తెలంగాణలో కూడా ఓదార్పు యాత్ర చేశాను. ఎప్పుడు అడిగితే అప్పుడు మాట కూడా మాట్లాడకుండా అండగా నిలబడ్డాను.

 

స్వలాభం చూసుకోకుండా నిస్వార్ధంగా ఏది అడిగితే అది చేశాను. గత ఎన్నికలలో బై బై బాబు అంటూ ఊరురా తిరిగాను. దేశంలోనే మిస్డ్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ చేసా, జగనన్నని గెలిపిస్తే సీఎం అయ్యాక పూర్తిగా మారిపోయారు. వైయస్సార్ పేరు నిలబడతాడు అనుకుంటే ఈ ఐదేళ్లలో ముఖ్యమంత్రితో సహా అందరూ భాజాపా కి బానిసలుగా మారిపోయారు అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ ధుమారాన్ని రేపుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -