Surender Reddy: వైరల్ అవుతున్న సురేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Surender Reddy: సినీ దర్శకుడు సురేందర్ రెడ్డి తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమే. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అతడొక్కడే సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన సురేందర్ రెడ్డి వెంటనే జూనియర్ ఎన్టీఆర్ తో అశోక్ సినిమా డైరెక్ట్ చేశాడు. మెగాస్టార్ చిరంజీవితో ఆయన నిర్మించిన సైరా నరసింహారెడ్డి సినిమాతో ఆయన టాలెంట్ ని మరోసారి నిరూపించుకున్నారు.

ఎక్కడో కరీంనగర్ జిల్లాలో పుట్టిన సురేందర్ రెడ్డి ఇంటర్మీడియట్ వరకు చదువుని సజావుగానే సాగించాడు కానీ డిగ్రీ మధ్యలోనే సినిమాల మీద ఆసక్తితో చదువుకి గుడ్ బై చెప్పి హైదరాబాద్ వచ్చేసాడు. మణిరత్నం ఘర్షణ, రాంగోపాల్ వర్మ శివ సినిమాలు అతనిని ఇన్స్పైర్ చేశాయని. ఆ సినిమాలు చూశాకే సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని ఆలోచన వచ్చిందని చెప్పుకొచ్చారు సురేందర్ రెడ్డి.

మొదటి సినిమా అవకాశం అంత సులువుగా రాలేదని, సినీ ఇండస్ట్రీలో పరిచయం ఉన్నవాళ్లు ఎవరూ లేరని చెప్పుకొచ్చారు సురేందర్ రెడ్డి. ఇంతకీ విషయం ఏమిటంటే ఈ మధ్యనే సురేందర్ రెడ్డి ఒక ఛానల్ కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అశోక్ సినిమా గురించి మాట్లాడుతూ అతనొక్కడే సినిమా తీసిన వెంటనే తను ప్రభాస్ సినిమాకి కమిట్ అయ్యానని..

కానీ అనుకోకుండా జూనియర్ ఎన్టీఆర్ మేనేజర్ సుకుమార్ అనే వ్యక్తి తనని కంటిన్యూస్ గా ఫాలో అయ్యేవారని, రెండు రోజులపాటు తనని తీసుకువెళ్ళిపోయి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశారని, అలా చేద్దాం, ఇలా చేద్దాం అంటూ తనని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించారని అప్పుడు వచ్చిన కదే అశోక్ అని చెప్పుకొచ్చారు సురేందర్ రెడ్డి. అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న ఎన్టీఆర్ కి ఆ సినిమా పెద్ద డిజార్డర్ ని మిగిల్చింది. సురేందర్ రెడ్డి తీసిన చాలా సినిమాలకి కథ వక్కంతం వంశీ అందించినవే కావటం విశేషం. వాళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన కిక్ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -