Tammareddy Bharadwaj: దిల్ రాజు ఇంటికి వెళ్లి ఎందుకు అడుకున్నావ్.. నిఖిల్ పై తమ్మారెడ్డి ఫైర్!

Tammareddy Bharadwaj: చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం కార్తీకేయ 2 . కార్తికేయ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా ఇటీవల విడుదలై రికార్డు స్థాయిలో వసూళ్లు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ఈ సినిమా పై సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకుల కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదలకి ముందు నిఖిల్ చేసిన వ్యాఖ్యల గురించి సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ మండి పడ్డారు. కార్తికేయ 2 సినిమా విడుదల చేయనీకుండ కొందరు సినీ ప్రముఖులు అడ్డు పడుతున్నారని నిఖిల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కావాలనే తనని టార్గెట్ చేసి నా సినిమా రిలీజ్ చేయనీయటం లేదని నిఖిల్ మీడియా సమావేశంలో చాలా బాధపడ్డాడు.

ఈ క్రమంలో ఈ విషయం గురించి తమ్మారెడ్డి భరద్వాజ్ స్పందిస్తూ… హీరోలు సినిమా హిట్ అయినప్పుడు ఒకలాగ, ఫ్లాప్ అయినప్పుడు ఒకలాగ మాట్లాడకూడదు. నీకు ఏదైనా ఉంటే ముందు మాట్లాడు. దిల్ రాజు వల్ల నీ సినిమాని వాయిదా వేసుకున్నా అన్నప్పుడు .. దిల్ రాజుని ఆరోజు ఎందుకు తిట్టలేదు. నిజంగా నీకు దమ్ము ఉంటే.. దిల్ రాజు సపోర్ట్ చేయడం లేదని ఆ రోజు మైక్ లాక్కుని అడగాల్సింది.

ఇక సక్సెస్ మీట్ లో మాట్లాడుతున్నప్పుడు దిల్ రాజు మాట్లాడుతుంటే నువు ఎందుకూ సైలెంట్ గా ఉన్నావు అని నిలదీశాడు. అంతే కాకుండా తర్వాత దిల్ రాజు ఇంటికి నువ్వు ఎందుకు వెళ్లి అడుక్కున్నావ్..? అసలు నువ్వు ఎవడివి దిల్ రాజు ఇంటికి వెళ్ళడానికి? నీకేం అవసరం ఉంది అంటూ ప్రశ్నించాడు. అసలు సినిమా రిలీజ్‌తో హీరోకి పనేంటి? హీరో అయిన నువ్వు నా సినిమా రిలీజ్ చేయటానికి థియేటర్స్ ఇవ్వడం లేదని నువ్వు ఎందుకు స్టేట్ మెంట్ ఇచ్చావ్ అంటూ మండిపడ్డారు.

నువ్వు హీరోవి.. హీరో పనులు హీరో చేసుకోవాలి.. డబ్బులు తీసుకోకుండా నువ్వేం సినిమా చేయలేదు కదా అంటు రెచ్చిపోయాడు. థాంక్యూ సినిమాకి పోటీగా వస్తున్నావని దిల్ రాజు నీ సినిమా ఆపాడా? మాచర్ల నియోజకవర్గం’ సినిమాకి పోటీగా ‘కార్తికేయ 2’ ను రిలీజ్ చేసే ధైర్యం ఉన్నప్పుడు.. ‘థాంక్యూ’ మూవీకి పోటీగా ఎందుకు రిలీజ్ చేయలేకపోయావు అంటూ ప్రశ్నించాడు. ఇండస్ట్రీలో ఎవరైనా సినిమా తీసేది డబ్బు సంపాదించటానికి మాత్రమే దేశాన్ని ఉద్దరించటానికీ కాదు అంటూ మండి పడ్డారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -