ఎన్నో సినిమాలలో బాలనటిగా నటించిన కుట్టి పద్మిని అనంతరం సినిమాలలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి పద్మిని కమల్ హాసన్ గురించి ఆయన హీరోయిన్లతో పెట్టుకున్న ఎఫైర్ గురించి సంచలన వ్యాఖ్యలు. కమల్ హాసన్ గారు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు హీరోయిన్లతో ఎఫైర్ పెట్టుకొని చివరికి వేరే ఆమెను పెళ్లి చేసుకున్నారని తెలిపారు.
కమల్ హాసన్ ఇండస్ట్రీలో శ్రీదేవి, రేఖ, జయసుధ, గౌతమి, శ్రీవిద్య, సారికలతో కమల్ హాసన్ లవ్ అఫైర్ పెట్టుకున్నారు.అయితే అందరూ కూడా కమల్ హాసన్ శ్రీవిద్యను పెళ్లి చేసుకుంటారని భావించారు కానీ కమల్ హాసన్ మాత్రం శ్రీవిద్యను కాకుండా వాణి గణపతిని తన జీవిత భాగస్వామిగా చేసుకున్నారు. అయితే తనని కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో శ్రీవిద్య మానసికంగా ఎంతో కృంగిపోయారనీ, అనంతరం శ్రీవిద్య జార్జ్ అనే వ్యక్తిని పెళ్లి వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు.
ఇక తనతో ఎక్కువ కాలం పాటు ఉండలేనటువంటి శ్రీ విద్య తనకు విడాకులు ఇచ్చారు అయితే ఈమె క్యాన్సర్ బారిన పడటంతో తన ఆస్తి మొత్తం ఓ ట్రస్టుకు రాసి ఉంచారని ఈ సందర్భంగా పద్మిని తెలిపారు.ఇలా కమల్ హాసన్ ఏకంగా ఇంత మందితో ఎఫైర్ పెట్టుకున్నారు. అలాగే సారికను వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. ఇక నటి గౌతమీతో కూడా కొంతకాలం పాటు కమల్ హాసన్ రిలేషన్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే.