Jeevitha Rajashekar: చిరంజీవిపై ఆరోపణలు జీవిత రాజశేఖర్ కొంప ముంచాయా.. ఏమైందంటే?

Jeevitha Rajashekar: తెలుగు ప్రేక్షకులకు నటి జీవిత రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జీవిత హీరో రాజశేఖర్ ను ప్రేమించి వివాహం చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. తరచూ ఈ జంట ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఈ నేపథ్యంలోని తాజాగా ఈ జంట పేరు మరోసారి సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. తాజాగ జీవిత రాజశేఖర్ దంపతులకు ఊహించని షాక్ ఎదురైంది. పరువునష్టం కేసులో సినీ నటులు జీవిత, రాజశేఖర్‌ దంపతులకు నాంపల్లిలోని 17వ అడిషనల్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు మంగళవారం ఏడాది జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించింది.

వారు 2011లో చిరంజీవి బ్లడ్‌ బ్యాంకుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, దాతల నుంచి ఉచితంగా సేకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారని ఆరోపించారంటూ సినీ నిర్మాత అల్లు అరవింద్‌ అప్పట్లోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. చిరంజీవి పేరుతో నడుస్తున్న సేవా కార్యక్రమాల పై, ట్రస్టు సేవలపై అసత్య ఆరోపణలు చేశారంటూ పరువునష్టం దావా వేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది. జరిమానా చెల్లించడంతో అప్పీలుకు అవకాశమిస్తూ రాజశేఖర్‌ దంపతులకు న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. ఈ విషయం కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -