Tirupati: దైవ దర్శనానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన జంట.. ఏం జరిగిందంటే?

Tirupati: ప్రతిరోజు రోడ్డు ప్రమాదాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇలా రోడ్డు ప్రమాదాల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అతివేగం ప్రమాదకరమని తెలిసిన చాలామంది ప్రాణాలతో చెలగాటలాడుతున్నారు.ఇలా ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి వారు కూడా అతి చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు రోజుకు ఎన్నో జరుగుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన శ్రీకాళహస్తిలో చోటు చేసుకుంది.

పూర్తి వివరాలలోకి వెళితే శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్సీపి గురుకులం సమీపంలో ఒరుగు దయాసాగర్, మధుమతి దంపతులను నివసిస్తున్నారు. వీరి కుమారుడు డాక్టర్ సూర్య తేజ రెడ్డి కోడలు మౌనిక రెడ్డి ఇద్దరు కూడా డాక్టర్లే. వీరి వివాహం గత ఏడాది ఎంతో ఘనంగా జరిగింది. గురువారం పౌర్ణమి కుటుంబ సమేతంగా కారులో తిరువన్నామలైకి వెళ్లి గిరి ప్రదక్షిణలు చేసుకున్నారు. ఇలా గిరిప్రదక్షిణలు చేసుకున్న తర్వాత శుక్రవారం తిరిగి ప్రయాణమయ్యారు.

 

వేలూరు జిల్లా ఒడిగత్తూరు నుంచి వస్తున్నటువంటి మినీ కారును ఢీ కొట్టడంతో కారులో ఉన్నటువంటి దయాసాగర్ రెడ్డి సూర్య తేజరెడ్డి అక్కడికక్కడే మరణించారు. తీవ్ర గాయాలు పాలైనటువంటి మధుమతి,మౌనిక రెడ్డిని హాస్పిటల్ లో చేర్చగా మౌనిక రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు మధుమతి పరిస్థితి కూడా విషమంగానే ఉంది.

 

ఇలా ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు మరణించడంతో వీరి కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ప్రమాదంలో కొడుకు కోడలు ఇద్దరు డాక్టర్లు మరణించడం అందరిని శోకసంద్రంలో ముంచింది. ఇక సూర్యతేజ అపోలో హాస్పిటల్లో డాక్టర్ గా వ్యవహరిస్తుండగా మౌనిక విజయనగరంలోని హౌస్ సర్జన్ గా పనిచేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -