Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఇటీవల వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈయన డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఇటీవల చిత్రీకరణ ప్రారంభించుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ లొకేషన్లోకి నటి త్రిష కూడా ఎంట్రీ ఇచ్చారు.
ఇకపోతే ఈ సినిమాలు త్రిషతో పాటు మరో ముగ్గురు హీరోయిన్లు కూడా నటించబోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగానే నటి మీనాక్షి చౌదరి ఈ సినిమాలో ఎంపిక అయ్యారని సమాచారం. ఇటీవల కాలంలో వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి మీనాక్షి చౌదరి తాజాగా గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా అనంతరం ఈమె మెగాస్టార్ చిరంజీవి సినిమా ఛాన్స్ అందుకున్నారని తెలుస్తుంది. ఇదే కనుక నిజమైతే ఈమె దశ పూర్తిగా మారిపోయినట్లేనని పలువురు భావిస్తున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమా కోసం హైదరాబాద్లో సరికొత్త లోకాన్ని సృష్టించారని ఇందులో దేవకన్య పాత్రలో మీనాక్షి చౌదరి కనిపించబోతున్నారని సమాచారం.
యువి క్రియేషన్ బ్యానర్ పై ఈ సినిమా భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటివరకు చిరు కెరీర్ లోనే ఈ సినిమా హైయెస్ట్ బడ్జెట్ అని సమాచారం. ఈ సినిమా కోసం దాదాపు 150 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా వచ్చేయడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.