Adipurush: ఆది పురుష్ సినిమా చూసిన వానరం.. వైరల్ అవుతున్న వీడియో!

Adipurush: ప్రభాస్ కృతి సనన్ జంటగా రామాయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ఆది పురుష్. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నటువంటి అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్లకు తరలి వెళ్తున్నారు.రామాయణం ఆధారంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో దర్శక నిర్మాతలు ప్రతి థియేటర్ లోనూ హనుమంతుడి కోసం ఒక సీటు కేటాయించాలని చెప్పిన సంగతి మనకు తెలిసిందే.

హనుమంతుడు రాముడికి పరమ భక్తులు.ఎక్కడైతే రామ పారాయణం జరుగుతుందో అక్కడికి తప్పకుండా హనుమంతుడు వస్తారన్న నమ్మకం మన హిందువులలో ఉంది. అందుకే ప్రతి థియేటర్లోనూ హనుమంతుడి కోసం ఒక సీటు కేటాయించాలని సూచించారు.ఈ క్రమంలోనే ప్రతి థియేటర్లోనూ హనుమంతుడికి ఒక సీటు కేటాయించడమే కాకుండా ఆ సీటుకు ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తున్నారు.

తాజాగా ఒక థియేటర్లోఈ సినిమా ప్రదర్శితం అవుతున్న సమయంలో అనుకోకుండా ఈ థియేటర్లోకి ఒక వానరం వచ్చింది.ఇలా థియేటర్లో వానరం ఈ సినిమా చూస్తూ ఉండటంతో ఒక్కసారిగా థియేటర్ మొత్తం జైశ్రీరామ్ అనే నామస్మరణతో మారుమోగిపోయింది. నిజంగానే ఈ సినిమా చూడటం కోసం హనుమంతుడే ఇలా వానరుడి రూపంలో వచ్చారంటూ ప్రేక్షకులు భావిస్తున్నారు.

ఇలా వానరం అనుకోకుండా థియేటర్లోకి వచ్చి ఈ విధంగా ఈ సినిమా చూడటంతో నిజంగానే రామ పారాయణం జరిగే చోట హనుమంతుడు వస్తారు అనడానికి ఇదే నిదర్శనం అని పలువురు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో రాముడు పాత్రలో ప్రభాస్ నటించిన సంగతి మనకు తెలిసింది. అలాగే సీతగా కృతి సనన్ నటించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -