Modi: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఫాలోయింగ్ ఉన్న వ్యక్తుల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఒకరు. దేశంలో కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, అంతర్జాతీయంగా మాత్రం ఆయన ప్రతిష్ఠ అంతకంతకు పెరుగుతోంది. ఇటు దేశంలో అటు గ్లోబల్ గా పెద్ద ఎత్తున అభిమానులను సంపాందించుకుంటారున్నారు మోదీ. తాజాగా ఓ వృద్ధులు ప్రధాని మోదీపై చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.
మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లా హరిపుర గ్రామానికి చెందిన మంగీబాయి తన్వర్ అనే ఆ వృద్ధురాలి మోదీ నా కుమారుడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తన పేరున ఉన్న 25 ఎకరాల భూమిని ప్రధానికి రాసిస్తానని చెబుతూ ఆ వందేళ్ల బామ్మ చెబుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ బామ్మకి 14 మంది సంతానం ఉన్నారు. మోదీని తన 15వ కుమారుడిలా భావిస్తానని ఆమె చెబుతోంది. దేశానికి ఎంతో సేవ చేస్తున్నారని పొగడ్తలతో ముచ్చెత్తింది. అలాగే తనకూ ఎన్నో పథకాలు అందిస్తున్నారని ప్రశంసలు కురిపించింది. కేవలం మోదీకి మాత్రమే తాను ఓటు వేస్తానని వెల్లడించింది. తనతో పాటు దేశంలోని ఎందరో వృద్ధుల అవసరాలను మోదీ తీరుస్తున్నారని అంటోంది.
ప్రస్తుతం ఆ వృద్ధురాలు మాట్లాడిన వీడియోలో మంగీబాయి చుట్టూ ఉన్న కొందరు నువ్వు మోదీని గుర్తించగలవా అని ప్రధాని ఫోటో చూపించగా హా.. ఇతనే మోదీ టీవీల్లో చూశానని సమాధానం ఇచ్చింది. దీంతో బీజేపీ నేతలు ఆమెను ఆకాశానికి ఎత్తెస్తూ పొగుడుతున్నారు.