Vijayawada: స్నానం చేస్తున్న ఫోటోలు తీసిన వ్యక్తి.. ఆపై ఫోటోలతో?

Vijayawada: విజయవాడ అజిత్ సింగ్ నగర్ పరిధిలో ఉన్న విశాలాంధ్ర కాలనీలో పుట్టా సుభాష్ అనే 45 ఏళ్ళ వ్యక్తి నివసిస్తున్నాడు. సుభాష్ స్థానికంగా ఉండే ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. కాగా సుభాష్ అదే గ్రామానికి చెందిన కిరాణ షాపును నడిపిస్తున్న మహిళ పై కన్నేశాడు. రోజూ ఆమె షాపుకు వెళ్తూ ఉండేవాడు. అలా సుభాష్ సదరు మహిళతో బాగా పరిచయం పెంచుకున్నాడు. మహిళ షాపులో సరుకులు కొనుగోలు చేసిన ప్రతిసారి కూడా ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లించేవాడు. డబ్బులు పంపించే క్రమంలోనే ఆమె ఫోన్ నెంబర్ తీసుకొని దానిని ఆసరాగా చేసుకున్న సుభాష్ తరచూ ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేసేవాడు.

ఇదిలా ఉంటే ఏడాది కిందట సుభాష్ ఆ మహిళ ఇంటికి వెళ్లాడు. అదే సమయంలో ఆమె స్నానం చేస్తుండగా సుభాష్ దొంగ చాటుగా సెల్ ఫోన్ లో ఫొటోలు తీసుకున్నాడు. ఇక అదే వీడియోలను ఆమెకు చూపించాడు. వాటిని చూసిన ఆ మహిళ ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఆ ఫొటోలతో సుభాష్ ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తూ ఆ మహిళపై అనేక సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగని సుభాష్ తనకు డబ్బులు ఇవ్వాలని లేకుంటే ఆ ఫోటోలను బయటపెడతాను బెదిరింపులకు పాల్పడ్డాడు. అలా ఆ మహిళ నుంచి దాదాపుగా 16 లక్షల వరకు డబ్బులు కాజేసుకున్నాడు.

 

అయితే తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆ మహిళ ఎన్నిసార్లు వేడుకున్న కూడా ఆమెపై దాడి చేయడమే కాకుండా అత్యాచారం చేశాడు. సుభాష్ ఇలా ఏడాది కాలంగా ఆ మహిళను అన్ని రకాలు హింసిస్తూ నరకం చూపించాడు. ఇన్నాళ్లు భరించిన ఆ మహిళ ఇక తట్టుకోలేకపోయింది. సుభాష్ దారుణంపై ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -