Taraka Ratna: కన్నీళ్లు పెట్టిన తారకరత్న కూతురి మాటలు.. ఏమైందంటే?

Taraka Ratna: నందమూరి తారకరత్న ఎంత మంచి వాడో అందరికీ తెలిసిందే. ఆయన చివరి చూపుకోసం వచ్చిన జనాన్ని చూస్తే తెలిసిపోతోంది ఈ విషయం.ఇక తారకరత్న జీవితం
ఏమంత సాఫీగా సాగలేదు. పెళ్లి జీవితం అంతా స్ట్రగ్ లింగే. కానీ ఎక్కడా కుటుంబానికి ఇబ్బంది కలిగించకుండా చూసుకున్నాడు. లవ్ మ్యారేజ్ చేస్తున్నా అలేఖ్యా రెడ్డిని ఏ రోజు కష్టపెట్టలేదని తెలుస్తోంది. పిల్లల్ని కూడా అల్లారుముద్దుగా పెంచాడు. ఇక తాజాగా తారకరత్న కూతురు గురించి ఓ వీడియో వైరల్ అవుతోంది.

 

టాలీవుడ్ హీరో నందమూరి తారకరత్న ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. గుండెపోటుకు గురై తారకరత్న 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి కన్నుమూశారు. ఆయన మరణంతో భార్య అలేఖ్య రెడ్డి తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తారకరత్నను తలుచుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టింది. తిరుమలలో ఫ్యామిలీతో కలిసి చివరిసారిగా దిగిన ఫోటోను పంచుకున్నారు అలేఖ్యా రెడ్డి. అలాగే తారతరత్న పెద్దకర్మ సందర్భంగా భర్త రాసిన వాలెంటైన్స్ డే నోట్ ను షేర్ చేసి ఎమోషనలయ్యారు.

తాజాగా తారకరత్న కూతురు నిషిక రాసిన నోట్ ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. నిషిక రాస్తూ.. ‘అమ్మా నువ్వు చాలా బాధలో ఉన్నావు. నువ్వు ఇంకోసారి ఏడిస్తే.. నేను నీకు గుడ్ బై చెప్తా’ అంటూ రాసింది. తారకరత్న కూతురు నిషిక రాసిన నోట్ చూస్తే అమ్మపై ప్రేమ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు . నిషిక రాసిన నోట్ ను అలేఖ్య రెడ్డి తన ఇన్స్టాలో షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు బావోద్వేగానికి లోనవుతున్నారు. వారికి ధైర్యం చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -