Tomatoes: గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మొన్నటి వరకు పచ్చిమిర్చి ధర 100 నుంచి 120 రూపాయల వరకు పలకగా ఇప్పుడు టమోటా ధర ఏకంగా 150 నుంచి 150 వరకు పలుకుతోంది. దాంతో సామాన్య ప్రజలు టమోటా పండ్లను కొనాలి అంటేనే ఆలోచించాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. కానీ టమోటా రైతులకు మాత్రం ఇది ఎంతో శుభవార్త అని చెప్పవచ్చు. ఎప్పటి నుంచో సరైన ధరల కోసం ఎదురు చూస్తున్న రైతన్నకు మాత్రం శుభవార్త అనే చెప్పాలి.
ఎన్ని పంటలు పండించినా రైతు అప్పులు పాలు అవుతున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు టమాట రైతుల మోహంలో చిరునవ్వులు కనిపిస్తున్నాయి. మంచి లాభాలను పొందుతున్నారు. ఇటీవల ఒక రైతు టమాటలు అమ్మి ఒకే రోజు ఏకంగా రూ. 38 లక్షల సొమ్ము కళ్ళ చూసినట్లు తెలిసింది. ఇంతకీ ఆ రైతు లేరు ఎన్ని టమోటాలు అమ్మారు అన్న విషయానికి వస్తే.. కర్ణాటక కోలార్ ప్రాంతానికి చెందిన రైతు కుటుంబం ఒకే రోజు రూ. 38 లక్షల విలువైన టమాటాలు విక్రయించినట్లు తెలిసింది. బేతమంగళం జిల్లాలోని ప్రభాకర్ గుప్తా, అతని సోదరుడు గత కొంత కాలంగా వారికున్న 40 ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తున్నారు.
రెండు సంవత్సరాల క్రితం ఒక్కో బాక్స్ రూ. 800కి విక్రయించారని ఆ తరువాత అత్యధిక ధర ఇదే అనే చెబుతున్నారు. మంగళవారం వారు ఒక్కో బాక్స్ రూ. 1900కు మొత్తం 2000 బాక్సులు విక్రయించి రూ. 38 లక్షలు సొంతం చేసుకున్నారు. ఆ రైతులకు నాణ్యమైన టమాట ఎలా పండించాలో తెలుసనీ ఆ కారణంగానే పంటను తెగులు నుంచి కాపాడుకున్నామని వెల్లడించారు. మొత్తానికి టమాట వల్ల వారి ముఖాల్లో వెలుగు నిండిపోయింది. దాంతో ఒక్కసారిగా వారి జీవితాలు తారుమారు అయ్యాయి.