Double Hatrick Heros: డబుల్ హ్యాట్రిక్ హిట్లు కొట్టిన టాలీవుడ్ హీరోలు ఎవరో తెలుసా?

సాధారణంగా ఏదైనా సినిమా విజయం సాధించిందంటే ఆ హీరో ఫ్యాన్స్ కు పండగే పండగ. అదే హ్యాట్రిక్ కొడితే, ఫ్యాన్స్ ఆనందానికి ఒక లిమిట్ అంటూ ఉండదు. ఆ హీరోకు, అభిమానుల సంతోషానికి హద్దే ఉండదు. అదే డబుల్ హ్యాట్రిక్ కొడితే.. అంటే వరుసగా ఆరు సినిమాలు హిట్ అయితే ఆ హీరోకు, అభిమానులకు పట్టలేని సంతోషం. మరి తెలుగు ఇండస్ట్రీలో వరుసగా ఆరుసార్లు హిట్ కొట్టిన హీరోలు ఎవరో చూసేద్దాం.

ఎన్టీఆర్: అప్పట్లో నాలుగు వరుస హిట్స్ కొట్టి తృటిలో డబల్ హ్యాట్రిక్ ను మిస్ చేసుకున్నారు.

ఏఎన్ఆర్: ఈ హీరో సినిమాలు కూడా వరుసగా నాలుగు విజయం పొంది, ఐదవ చిత్రం హిట్ కాకపోవడంతో డబల్ హ్యాట్రిక్ మిస్ అయింది.

శోభన్ బాబు: ఇతను చేసిన వరుసగా ఆరు సినిమాలు హిట్ కొట్టి రికార్డును సృష్టించారు. డబల్ హ్యాట్రిక్ ను సొంతం చేసుకున్నాడు.

సూపర్ స్టార్ కృష్ణ: ఈయన చేసిన సినిమాలు కూడా వరుసగా ఆరు సినిమాలు విజయం సాధించాయి. ఈయన కూడా తన ఖాతాలో డబల్ హ్యాట్రిక్ వేసుకున్నాడు.

మెగాస్టార్ చిరంజీవి : ఈ హీరో వరుసగా ఐదు హిట్స్ కొట్టి ఆరవ చిత్రం ఇద్దరు మిత్రులు హిట్ కాకపోవడంతో తృటిలో డబల్ హ్యాట్రిక్ ను మిస్ చేసుకున్నాడు.

నందమూరి బాలకృష్ణ: ఇతను చేసిన వరుస ఆరు సినిమాలు హిట్ కొట్టడం జరిగింది. విశేషం ఏమిటంటే ఈ ఆరు సినిమాలు ఒకే సంవత్సరంలో రిలీజ్ అవ్వడం జరిగింది.

అక్కినేని నాగార్జున: ఇతని వరుస ఆరు సినిమాలు విజయం సాధించడంతో డబుల్ హ్యాట్రిక్ సాధించడం జరిగింది.

విక్టరీ వెంకటేష్: ఈ హీరో చేసిన వరుస ఆరు సినిమాలు విజయం సాధించడంతో ఈయన కూడా డబల్ హ్యాట్రిక్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్: ఈయన వరుసగా చేసిన ఆరు సినిమాలు విజయం సాధించడంతో ఈ డబుల్ హ్యాట్రిక్ ను సొంతం చేసుకున్నాడు.

అల్లు అర్జున్: ఇతను చేసిన ఐదు సినిమాలు విజయం సాధించాయి. ఆరవ సినిమా హ్యాపీ తో డబుల్ హ్యాట్రిక్ తృటిలో మిస్ అవ్వడం జరిగింది.

హీరో నాని: ఇతని వరుస ఆరు చిత్రాలు విజయం సాధించడంతో ఈ డబుల్ హ్యాట్రిక్ ను సొంతం చేసుకున్నాడు.

రాజేంద్రప్రసాద్: వరుసగా చేసిన ఆరు సినిమాలు విజయం సాధించడంతో ఈ రికార్డును తన అకౌంట్లో వేసుకున్నాడు.

హీరో వినోద్: అప్పట్లో చేసిన వరుస ఆరు సినిమాలు విజయం సాధించడంతో ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -