Maharashtra: కారు బ్యానెట్ పై ట్రాఫిక్ పోలీస్.. చివరికి?

Maharashtra: తాజాగా మహారాష్ట్రలో ఒక భయంకరమైన ఘటన చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని నవీ ముంబైలో ఆదివారం మహారాష్ట్ర భూషణ్ అవార్డు వేడుక జరిగింది. ఈ అవార్డు ప్రధానోత్సవానికి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా హాజరయ్యారు. కేంద్రమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు కోపర్ ఖేరాణే వాశీ మార్గంలో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో సిద్దేశ్వర్ మాలి అనే 37 ఏళ్ళ ట్రాఫిక్ కానిస్టేబుల్ బ్లూ డైమండ్ సిగ్నల్ వద్ద ఒక కారును ఆపే ప్రయత్నం చేశారు.

అయితే కారులో ఉన్న వ్యక్తి ఆపకుండా ముందుకు పోనివ్వడంతో ట్రాఫిక్ పోలీస్ కారు బానెట్ పైనే ఉండిపోయాడు. అయినా కూడా కారులో ఉన్న వ్యక్తి ఆపకుండా వేగంగా ముందుకు పోనిచ్చాడు. ప్రాణ భయంతో కానిస్టేబుల్ కారు బానెట్ ను గట్టిగా పట్టుకున్నాడు. 20 కిలోమీటర్ల దూరం, 15 నుంచి 20 నిమిషాల పాటు బానెట్ పై ట్రాఫిక్ పోలీస్ ను తీసుకెళ్లిన కారుకి గవ్హాన్ ఫాటా ప్రాంతం వద్ద బ్రేకులు పడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కారుని వెంబడించి ఒక కంటైనర్ ను అడ్డుపెట్టి కారుని బ్లాక్ చేశారు.

 

దీంతో నిందితుడు పోలీసులకు చిక్కాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా ఆ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆ కారును వెంబడించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిండుతుడు ఆదిత్య బెండె అనే 23 ఏళ్ల యువకుడిగా పోలీసులు గుర్తించారు. నిందితుడికి వైద్య పరీక్షలు నిర్వహించగా గంజాయి తీసుకున్నట్లు తేలింది. గంజాయి తీసుకున్న యువకుడి పై హత్యాయత్నం కేసు, ర్యాష్ డ్రైవింగ్, మాదక ద్రవ్యాల చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటనలో అదృష్టవశాత్తు కానిస్టేబుల్ కి ఎటువంటి ప్రమాదం జరగలేదు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -