Maharashtra: పెళ్లయిన ఏడాదికే ఇటుక బట్టీలో పని చేస్తూ అలా?

Maharashtra: ఈ మధ్యకాలంలో చాలామంది పెళ్లైన నవ వివాహితలు ప్రమాదవశాత్తు ఆత్మహత్య చేసుకొని ఎక్కువగా మరణిస్తున్నారు. కోటి ఆశలతో పెళ్లయి అత్తారింట్లో అడుగుపెట్టిన తర్వాత చాలామంది ఆడపిల్లలు పెళ్లయిన కొంతకాలానికి విగత జీవులుగా కనిపిస్తున్నారు. కొందరు వివాహితులు భర్త, వారి వేధింపులు తాలలేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ఇంకొందరు మాత్రం ప్రమాదవ శాత్తు మరణిస్తున్నారు. తాజాగా అటువంటి దారుణమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మహారాష్ట్ర కిన్వాట్ పరిధిలోని ఈనేగాం ప్రాంతానికి చెందిన రామ్ కిషన్ కు ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్ల సంతానం. వీరందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. చిన్న కూతురైన అనూషకు ఏడాది కిందటే ఉర్దూకి చెందిన మారుతి అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఇక వీరంతా బతుకు దెరువు కోసం రాష్ట్రాన్ని విడిచి నిర్మల్ జిల్లాకు చేరుకున్నారు. సారంగపూర్ పరిధిలోని బీరవెల్లి గ్రామంలోని ఒక వ్యక్తి ఇటుక బట్టీల్లో చాలా కాలంగా పనిచేస్తూ సంసారాన్ని నెట్టుకొస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 4న అనూష బహిర్భూమికి వెళ్తున్నాని భర్తకు చెప్పి వెళ్లింది. కానీ, చాలా సమయం దాటినా అనూష తిరిగి రాలేదు.

దీంతో ఆమె భర్త, తల్లిదండ్రులు ఖంగారుపడి చుట్టు పక్కల ప్రాంతాల్లో అంతటా వెతికారు. అయినా అనూష జాడ మాత్రం దొరకలేదు. ఇక వారికి ఆ సమయంలో ఏం చేయాలో అర్థంకాక స్థానిక పోలీసులను ఆశ్రయించారు. ఆ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనూష ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ఉన్నట్టుండి అనూష కనిపించకపోవడంతో ఆమె భర్త, తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -