ఉద్దానానికి ఊపిరిలూదిన సీఎం జగన్.. ఆ స్కీమ్ అమలుతో ఉద్ధానం ప్రజల జీవితాలు మారిపోనున్నాయా?

దశాబ్దాలుగా ఉద్దానం వాసులను వేధిస్తున్న ప్రధాన సమస్య కిడ్నీల సమస్య. ఈ వ్యాధి కారణంగా ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి అన్న కూడా పట్టించుకునే వారే కరువయ్యారు. రాజకీయ లబ్ధి కోసం మాత్రమే తప్పితే గత ప్రభుత్వాలు ఇందుకోసం చేసింది పెట్టింది పెద్దగా ఏమీ లేదు. కానీ జగనన్న పాదయాత్ర సమయంలో అక్కడి ప్రజలు పడుతున్న బాధలు స్వయంగా చూశారు. ఆస్పత్రుల్లో పడి ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారి బాధలను విన్నారు చూసి చలించిపోయారు. ఇక అప్పుడు ఖచ్చితంగా తాను అధికారంలోకి వస్తే మీ బాధలకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని హమీ ఇచ్చారు. ఉద్దానం పీడిత జనానికి అండగా నిలబడతానని ఇచ్చిన హమీ మేరకు పలాసలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని సుమారు 50 కోట్లకు పైగా ఖర్చుచేసి ఆస్పత్రి నిర్మించింది.

 

డాక్టర్‌ వైఎస్సార్‌ కిడ్నీ రీసెర్చ్‌ హాస్పిటల్‌ గా ప్రభుత్వం నామకరణం చేసింది. కిడ్ని వ్యాధికి గల మూల కారణాల పై పరిశోధన చేసి నివేదిక సిద్దం చేసింది. రోగం వచ్చాక ట్రీట్ మెంట్ చేయడం కాకుండా రోగం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రణాలిక సిద్దం చేశారు. కార్పోరేట్ స్థాయి వైద్యం ఇక నుండి ప్రతి ఒక్క పేదవాడికి అందేలా చర్యలు తీసుకుంటున్నారు. కిడ్ని రోగంతో ఏ ఒక్కరూ బాధపడకూడదనే తలంపుతో జగనన్న ఇచ్చిన హమీ మేరకు ఆస్పత్రి నిర్మాణం చేయడమే కాకుండా, రోగానికి మూలమైన నీటిని అందించేందుకు సుమారు 700 కోట్ల రూపాయలతో నీరు అందించేందుకు శాశ్వత పరిష్కారం చేశారు సీఎం జగన్. ఉద్దాన ప్రాంత ప్రజలకు వంశధార నీరు అందించేందుకు సుమారు 700 కోట్ల వ్యయంతో సుజలధార ప్రాజెక్టును జగనన్న ప్రభుత్వం నిర్మించింది.

పలాస, వజ్రపుకొత్తూరు, మందస, సోంపేట, కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం మండలాల్లోని ప్రజలకు వంశధార నది నుంచి స్వచ్ఛమైన తాగునీటిని అందించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రాజెక్టును చేపట్టింది. ఒక్కొక్కరికి రోజుకు వంద లీటర్లు చొప్పున నీటిని సరఫరా చేయాలన్నదే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ నెల 14న సీఎం వైయస్ జగన్ గారి చేతుల మీదుగా ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. ఈ రెండు ప్రాజెక్టులను సీఎం జగన్ చేతుల మీదుగా ఈ నెల 14 వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఉద్దానం కిడ్ని రోగులకు శాశ్వత పరిష్కార దిశగా అడుగులు వేస్తున్న జగన్ శ్రీకాకుళం జిల్లా వాసులు గుండెల్లో పెట్టుకున్నారు. ఈన్నెళ్ళుకు తమ సమస్య పరిష్కారం కాబోతుందని జిల్లా వాసులు ఆనందపడుతున్నారు. బతుకుపై ఆశను కలిగించిన జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటామని ఉద్దానం ప్రజలు అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -