Chiranjeevi-Upasana: చిరంజీవి చేసిన పని ఉపాసనకు అస్సలు నచ్చలేదా?

Chiranjeevi-Upasana: టాలీవుడ్ లో ఎంతో గుర్తింపు ఉన్న కుటుంబాల్లో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ ఒకటి. మెగా ఫ్యామిలీగా ప్రత్యేక గుర్తింపును కలిగి ఉన్న ఈ కుటుంబంలో ఎంతోమంది హీరోలు ఉన్నారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ, విష్ణుతేజలాంటి ఎంతోమంది హీరోలు సొంతంగా తమ ట్యాలెంట్ తో ప్రత్యేక గుర్తింపును సాధించారు.

 

మెగా ఫ్యామిలీ ఇప్పుడు టాలీవుడ్ కు పెద్ద దిక్కుగా మారగా.. తెలుగు ఇండస్ట్రీలో ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా చిరంజీవి ఇంటి తలుపును తడుతున్నారు. అయితే తాజాగా మెగా కుటుంబానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇండస్ట్రీలో చర్చకు దారితీసింది. మెగా కుటుంబంలో ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నాయని.. మెగాస్టార్ ఈ విషయంలో మదనపడుతున్నాడనే వార్త అందరికీ షాకిస్తోంది.

 

మెగాస్టార్ చిరంజీవికి రామ్ చరణ్ ఒక్కడే వారసుడు కాగా.. మిగిలిన వాళ్లంతా అమ్మాయిలే ఉన్నారు. అయితే చిరు కూతురు శ్రీజ తప్ప మిగిలిన వాళ్లు అంతా తమ జీవితాల్లో బాగా సెటిల్ అయ్యారు. శ్రీజ మాత్రం రెండు పెళ్లిళ్లు చేసుకొని, ఇద్దరు పిల్లలను కలిగి ఉండి.. ఇప్పుడు తన రెండో భర్తతో కూడా విడిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చిరంజీవి శ్రీజ మీద ఉన్న ప్రేమతో ఓ నిర్ణయం తీసుకోగా.. అదే గొడవకు కారణం అవుతోందట.

 

శ్రీజకు తోడుగా ఎవరూ ఉండబోరనే ఉద్దేశంతో చిరంజీవి తన ఆస్తిలో సగాన్ని శ్రీజ పేరు మీదకు మార్చాలని నిర్ణయించుకున్నాడట. అయితే ఈ విషయంలో ఉపాసన తన మామ చిరంజీవితో విభేదిస్తోందట. మెగా వారసుడిగా ఉన్న రామ్ చరణ్ కే అంతా ఆస్తి చెందుతుందని ఆమె అంటోందట. రామ్ చరణ్ కూడా ఉపాసన మాటకు కట్టుబడే ఉన్నట్లు సమాచారం. ఈ విషయంలో మెగా కుటుంబంలో గొడవ జరుగుతోందని.. దీంతో చిరంజీవి కాస్త మదనపడుతున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -