Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు తల్లిదండ్రులుగా మారిన తర్వాత ఎంతో సంతోషంలో ఉన్నారు. పెళ్లయిన 11 సంవత్సరాలకు వీరిద్దరూ తల్లిదండ్రులుగా మారడంతో వీరి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇలా కూతురు జన్మించిన అనంతరం కొద్దిరోజుల పాటు షూటింగ్లకు విరామం ఇచ్చినటువంటి రామ్ చరణ్ తన కూతురుతో విలువైన సమయాన్ని గడిపి తిరిగి తన సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు ఇక ఉపవాస సైతం తన పూర్తి సమయాన్ని తన కూతురితోనే గడుపుతున్నారు.
ఈ విధంగా ఉపాసన తన కూతురి ఆలనా పాలన చూసుకుంటూనే మరోవైపు తన వృత్తిపరమైన వ్యక్తిగత కార్యకలాపాలను కూడా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే తన కుమార్తె పుట్టిన తర్వాత మొదటిసారి రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఇద్దరు ఫారెన్ వెకేషన్ వెళ్లారు. వీరిద్దరూ కూడా ఓ వివాహ వేడుక కార్యక్రమంలో భాగంగా ఫారిన్ వెళ్లారని ఉపాసన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ఇక ఫారిన్ వెళ్లడం కోసం వీరిద్దరూ ఎయిర్ పోర్ట్ లో సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే ఈ ఫోటోలలో ఉపాసన ధరించిన డ్రెస్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనే ఉపాసన ధరించిన ఆ డ్రెస్ ఖరీదు ఎంత ఏంటి అని ఆరా తీయడం మొదలుపెట్టారు.
లైట్ పింక్ డ్రెస్లో ఎంబ్రయిడరి జాకెట్తో కూల్, స్టైలీష్ లుక్ లో కనిపించారు. అయితే ఉపాసన ధరించిన డ్రెస్ హేలీ మెన్జీస్ డిజైనర్ కు సంబంధించిన పాంథర్ కాటన్ జాక్వర్డ్.. దీని ధర రూ.42,317 ఉన్నట్లు తెలుస్తోంది. చూడటానికి చాలా సింపుల్ లుక్ లో కనిపిస్తున్నటువంటి ఈ డ్రెస్ ఖరీదు ఏకంగా 40 వేల రూపాయలు అని తెలియడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ డ్రెస్ లో ఉపాసన కూడా చాలా క్యూట్ గా అందంగా కనిపించడంతో ఈ ఫోటోలను మరింత వైరల్ చేస్తున్నారు.