Vastu Tips: వాస్తు దోషాలను వెండి వస్తువులతో ఎలా పరిహరించవచ్చో తెలుసుకోండి

Vastu Tips: వెండి వస్తువులు వాడటం గురించి వాస్తు శాస్త్రంలో కొన్ని ప్రయోజనాలను వివరించారు నిపుణులు. వాస్తు నియమాల ప్రకారం వెండికి చంద్రుడు, బృహస్పతితో సంబంధం కలిగి ఉందని చెబుతారు. వెండి వస్తువులు, ఆభరణాలు ధరించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి బోలెడు ప్రయోజనాలున్నాయట.

 

వాస్తు దోషాలు పోగొట్టడానికి వెండిని వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వెండి నగలు, ఆభరణాలు ధరిస్తే ఇంట్లో శాంతి సౌఖ్యాలు పెరుగుతాయంటున్నారు. ఇంట్లో సానుకూలత, ఇంటి యజమాని ఆదాయం పెరగడానికి వెండి వస్తువులు దోహదపడతాయని వాస్తు పండితులు చెబుతున్నారు.

 

వెండి వస్తువుల్లో వెండి తాబేలు, వెండి చేప ఇలా చాలా వస్తువులు ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఉపయోగాలు చేకూరుతాయి. ఇలా చేయడం వల్ల ఆనందం, శ్రేయస్సు లభిస్తాయి. మీ ఇంటికి ఉత్తరం మూలలో లాకర్ కు పశ్చిమ లేదా దక్షిణం వైపు నుంచి వెండి వస్తువులను ఉంచితే శుభం కలుగుతుందట. వాస్తు దోషాలు తొలగిపోవాలంటే మీ ఇంటి ప్రధాన ద్వారం నుంచి వెండి తీగను వేలాడదీయాలని సూచిస్తున్నారు.

 

ఇలా చేస్తే అదృష్టం వరిస్తుంది…
గోడలపై వెండి గోళ్లను కూడా ఉంచవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పూజా సామాగ్రి విషయంలోనూ వెండి పాత్రలు విశిష్టమైనవిగా చెబుతారు. వీటి ద్వారా అదృష్టాన్ని ఆకర్షించినట్లు అవుతుంది. వెండి గిన్నెలు రెండు తీసుకొని వాటిలో నీరు పోసి వెండి చేపలు ఉంచడం వల్ల అదృష్టం వరిస్తుందట. పడుకొనేటప్పుడు వెండి నాణేలను దిండు కింద ఉంచడం వల్ల బుధుడు లేదా అంగారకుడి వల్ల కలిగే నష్టాలు, దోషాలు తొలగిపోతాయని సూచిస్తున్నారు. వెండి నాణేలను మీ పర్సులో కూడా ఉంచుకోవచ్చు. ఆర్థిక లాభాలు కలుగుతాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -