Chandrababu: ఓడిపోయేందుకే జగన్ సిద్ధం.. 2024 ఎన్నికల్లో చంద్రబాబు చెప్పిన మాటలే నిజం కానున్నాయా?

Chandrababu: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున వైసిపి పార్టీ నుంచి కీలకమైనటువంటి నేతలు ఎమ్మెల్యేలు ఎంపీలు తెలుగుదేశం గూటికి చేరుతున్నారు. ఈ క్రమంలోనే నెల్లూరులో వైసిపి పార్టీలో కీలక నేతగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన సతీమణి కార్యకర్తలతో కలిసి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.

నెల్లూరు పివిఆర్ కన్వెన్షన్ లో ఏర్పాటు చేసినటువంటి సభలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పచ్చ కండువా కప్పుకున్నారు. ఈయనతో పాటు పలువురు సర్పంచులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

వేమి రెడ్డి ప్రభాకర్ రెడ్డి అజాత శత్రువు ఆయన ప్రజా సేవకు మారు పేరు. యుద్దానికి సై అంటూ అందరూ ముందుకు వెళ్తున్నారు. వేమిరెడ్డి రాకతో మనం సునాయాసంగా గెలవబోతున్నాము అంటూ చంద్రబాబు తెలిపారు. ప్రజలకు సేవ చేయాలనే ఒక్క ఉద్దేశంతోనే ఈయన మన పార్టీలోకి వచ్చారని తెలిపారు. ఈయన రాకతో నెల్లూరు కార్పొరేషన్ మొత్తం కాళీ అయ్యింది. పార్టీలోకి వచ్చే వారికి సాదర స్వాగతం పలుకుతున్నాను అంటూ చంద్రబాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇక జగన్ గురించి కూడా మాట్లాడుతూ జగన్ ప్రశ్నించిన వారిని వేదించడం మొదలు పెట్టారని తెలిపారు. ఎవరైనా తనని ఎదిరించిన వారిని వేదించడం మొదలు పెడుతున్నారని తెలిపారు. మనమందరం ఆయనని గద్దె దించడానికి సిద్ధం కావాలని 2024 లో ఆయనను ఇంటికి పంపించాలని తెలిపారు.తనని ఇంటికి పంపించే భాధ్యత మనమందరం తీసుకోవాలని చంద్ర బాబు పిలుపునిచ్చారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -