Venu Swamy: వైరల్ అవుతున్న వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు!

Venu Swamy: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు రామ్ చరణ్,ఉపాసన. కాగా గత ఏడాది తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని ప్రకటించిన ఉపాసన అప్పటినుంచి తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాలను సూచనలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే ఉంది. అయితే మెగా వారసుడి కోసం అభిమానులు, కుటుంబ సభ్యులు దాదాపు 11 ఏళ్లుగా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. జూన్ 20న ఆ శుభవార్తను తెలిపింది ఉపాసన. మంగళవారం జూన్ 24న తెల్లవారుజామున సమయంలో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

 

దీంతో అభిమానులు సెలబ్రిటీలు, రామ్ చరణ్ దంపతులకు పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక మెగా ఇంట్లోకి వారసురాలు అడుగుపెట్టడంతో మెగా ఇంట్లో సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా చిరంజీవి మనవరాలు పుట్టింది అన్న ఆనందంతో ఏకంగా మీడియాను ఏర్పాటు చేసి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే అభిమానులు, కుటుంబ సభ్యులు పాప పుట్టింది ఆనందంలో ఉండగా ఇటువంటి సమయంలో వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ సందర్భంగా వేణు స్వామి మాట్లాడుతూ..

రామ్ చరణ్ ఉపాసనలకు పుట్టిన పాప చాలా అదృష్టవంతురాలు అని, పాపకు రాజయోగం ఉందని పుట్టిన వేలా విశేషం తల్లిదండ్రులకు అలాగే తాతయ్యకు కెరియర్ పరంగా బాగా కలిసొస్తుంది అని చెప్పిన వేణు స్వామి.. రామ్ చరణ్ ఉపాసన దంపతులకు ఇదే ఆఖరి సంతానం అని మగసంతానం కలగకపోవచ్చు అని అంతేకాకుండా మెగా ఫ్యామిలీకి వారసుడే రాడు అని తేల్చి చెప్పేసాడు. దీంతో వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు విన్న మెగా అభిమానులు షాక్ అవుతున్నారు. దీంతో మెగా ఫ్యామిలీకి మగ సంతానం లేకపోతే ఎలా అంటూ షాక్ అయిపోతున్నారు మెగా ఫాన్స్.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -