Anushka Sharma-Virat Kohli: టాలీవుడ్ ప్రేక్షకులకు బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరో షారుక్ ఖాన్ సరసన రబ్ నే బనా దీ జోడీ సినిమాలో నటించి.. మొదటి సినిమాతోనే ఈ అమ్మడు బాలీవుడ్ ప్రేక్షకులను ఒక రేంజ్ లో మెప్పించింది. నిజానికి ఈ సినిమానే అనుష్కకు హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించి పెట్టిందని చెప్పవచ్చు.
అనంతరం అనుష్క శర్మ వరుస సినిమా ఆఫర్లను దక్కించుకొని వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఇక అమ్మడు తన అందంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మ కెరియర్ పరంగా ఒక రేంజ్ లో దూసుకుపోతున్న క్రమంలో క్రికెటర్ విరాట్ కోహ్లీని ప్రేమ పెళ్లి చేసుకుంది. మొత్తానికి ఈ జంట స్టార్ కపుల్స్ గా నిలిచారు. ఆ మధ్యనే ఈ జంటకు.. ఒక కూతురు కూడా పుట్టింది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ జంట ఖరీదైన భూమిని కొనుగోలు చేస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీనికి సంబంధించిన పేపర్లు కూడా సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నట్లు తెలుస్తుంది. అలీబాగ్ ప్రాంతంలో ఎనిమిది ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ భూమిలో ఒక ఫామ్ హౌస్ కూడా నిర్మించుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఆ ఫామ్ హౌస్ చూడడానికి చాలా అందంగా కనిపిస్తుందట.
ఇక ఈ ల్యాండ్ వాల్యూ విషయానికొస్తే దాదాపు 20 కోట్ల ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 1న జరిగినట్టుగా బాలీవుడ్ మీడియా ద్వారా తెలుస్తుంది. భూమి మొత్తం కొనుగోలు చేయడానికి 19.24 కోట్లు చెల్లించినట్లు తెలుస్తుంది. కేవలం స్టాంప్ డ్యూటీ గా 1.15 కోట్లు ఖర్చు చేసినట్లు బాలీవుడ్ మీడియా ద్వారా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ల్యాండ్ కు సంబంధించిన పత్రాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.