Virat Kohli – Anushka Sharma: స్కూటీపై భార్యతో కోహ్లీ.. ముంబై రోడ్లపై షికారు

Virat Kohli – Anushka Sharma: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతడి భార్య, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. తమ ప్రొపెషనల్, పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. అలాగే అభిమానులతో ముచ్చటిస్తూ వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉంటారు. ఇక జిమ్ లో వర్కౌట్లు చేస్తున్న వీడియోలు, నెట్ లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలను కోహ్లీ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. దీంతో అవి నెట్టింట వైరల్ గా మారుతూ ఉంటాయి.

వీటి వల్ల బిజినెస్ ప్రమోషన్ చేయడం వల్ల ఇన్ స్టాగ్రామ్ వల్ల కోహ్లీకి కోట్లలో ఆదాయం కూడా వస్తుంది. ఇది ఇలా ఉంచితే తాజాగా విరుష్క జంట ముంబై విధుల్లో చిక్కర్లు కొడుతుంది. అనుష్క శర్మను స్కూటీ మీద ఎక్కించుకుని ముంబై రోడ్లపై కోహ్లీ షికారు చేశాడు. ఇద్దరూ హెల్మెట్లు పెట్టుకోకవడంతో ప్రయాణికులు కూడా గుర్తించలేకపోయారు.

అయితే కొంతమంది ప్రయాణికులు గుర్తించి ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే బిజినెస్ ప్రమోషన్ కూడా విరుష్క ఇలా రోడ్లపై స్కూటీపై తిరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ నెలలో ప్రారంభం కానున్న ఆసియా కప్ కోసం కోహ్లీ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. తిరిగి ఫామ్ లోకి వచ్చేందుకు వర్కౌట్లు చేస్తున్నాడు. గత కొంతకాలంగా కోహ్లీ బ్యాటింగ్ తీరు, అతని ప్రదర్శనపై విమర్శలు వస్తున్నాయి. ఫామ్ లేమితో కోహ్లీ ఇబ్బందులు పడుతున్నారు. కోహ్లీ సెంచరీ చేయక రెండు సంవత్సరాలు అవుతుంది.

దీంతో కోహ్లీని జింబాబ్వే, శ్రీలంక పర్యటనల నుంచి తప్పించారు. ఆ జట్లతో మ్యాచ్ లకు కోహ్లీని జట్టు నుంచి తప్పించారు. ఇ ప్పుడు ఆసిాయా కప్ లో కోహ్లీ రాణించకపోతే అతడిపై విమర్శలు మరింత పెరిగే అవకాశముంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -