Ramoji Rao: ఆ ఆరోగ్య సమస్య వల్లే రామోజీరావు ఆస్పత్రిలో చేరారా?

Ramoji Rao: రామోజీరావు తెలుగు వారికి పరిచయం అవసరం లేని పేరు. ఈయన ఎన్నో దశాబ్దాలుగా ఇండస్ట్రీకి ఎన్నో సేవలను అందించారు. ఈనాడు వార్తాపత్రికను నడిపించడమే కాకుండా హైదరాబాద్ నగరంలో రామోజీ ఫిలిం సిటీకి యాజమాని కూడా. ఇక్కడ అన్ని భాషా చిత్రాలు పెద్ద షూటింగ్ జరుపుకుంటున్నాయి.ఇలా ఇండస్ట్రీకి ఎన్నో సేవలు అందించినటువంటి రామోజీరావు రాజకీయాలలో కూడా తనదైన శైలిలో చక్రం తిప్పారు.

ఇలా రాజకీయాలలో ఈయన ఎన్నో విమర్శలను ఎదుర్కోవడమే కాకుండా వివాదాలలో కూడా చిక్కుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈయన మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో భాగంగా విచారణలో పాల్గొన్న విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా ఈయన ఆసుపత్రి బెడ్ పై ఉన్నటువంటి ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇది అందరిని ఎంతగానో కలవరపెడుతోంది.

 

ఇలా ఈయన వయసు 86 సంవత్సరాలు కావడంతో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈయన తన ఇంట్లోనే ప్రత్యేక వైద్య నిపుణుల సమక్షంలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా వయసు పైబడటం చేతనే ఈయన బెడ్ కు పరిమితమయ్యారని తెలుస్తోంది. ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నటువంటి పలువురు ఈయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

 

ఇకపోతే కేవలం మార్గదర్శి చిట్ ఫండ్ విచారణ అనగానే రామోజీరావు ఆడుతున్న పెద్ద డ్రామా అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇలా రామోజీరావు బెడ్ పై పడుకొని అనారోగ్యం అంటూ డ్రామాలు చేస్తున్నారని పలువురు ఆరోపణలు కూడా చేస్తున్నారు.మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఈయన మాత్రం త్వరగా కోలుకొని ఆరోగ్యంగా ఉండాలని, అనారోగ్య సమస్యల నుంచి బయట పడాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -