Pawan Kalyan: జగన్ పై సంచలన ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్.. ఏం జరిగిందంటే?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేన నాయకుడిగా వారాహి యాత్రలో భాగంగా ఏలూరులో పర్యటించిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈయన వారాహి యాత్రలో భాగంగా జగన్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణలను ప్రశ్నిస్తూ తీవ్రస్థాయిలో జగన్ ప్రభుత్వం పై విరుచుకుపడుతుంది. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి జగన్ మోహన్ రెడ్డి గురించి ఆయన పరిపాలన గురించి పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ క్షేత్ర‌స్థాయిలో ఉన్న స‌మ‌స్య‌లకు లింకు పెడుతూ.. ఫొటోలు, ఆధారాల‌తో స‌హా విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇప్ప‌టికే ప‌లు విషయాల గురించి నేరుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి ఈయన తాజాగా ఏలూరులో ఉన్నటువంటి ప్రభుత్వ కళాశాల దుస్థితిని ఫోటోలతో సహా సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ జగన్మోహన్ రెడ్డిని తన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

 

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… త‌మ ప్ర‌భుత్వ హ‌యాంలో పాఠ‌శాల‌లు, కాలేజీల‌ను ఎంతో అభివృద్ధి చేస్తున్నామ‌ని.. విద్యారంగంలో రాష్ట్రాన్ని ఎక్క‌డికో తీసుకువెళ్తున్నామ‌ని చెప్పుకొనే సీఎం జ‌గ‌న్‌.. ఏలూరు జిల్లా కేంద్రంలోని ప్ర‌భుత్వ క‌ళాశాల దుస్థితిని గమనించాలని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇలా ఈ కాలేజీ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ…

 

చెట్ల కింద చదువులు చూడాలంటే ఎక్కడో మారుమూల పల్లెలకు వెళ్లాల్సిన అవసరం లేదు. జిల్లా కేంద్రం ఏలూరు నగరంలో ఉన్నటువంటి ప్రభుత్వ కళాశాలకు వెళ్తే చాలు పథకాలు పేర్లు చెప్పుకోవడం మీద ఉన్న శ్రద్ధ కాలేజీకి భవనం నిర్మించడంపై పెట్టాలి. 300 మంది చదువుతున్న ఈ కాలేజీకు బటన్ నొక్కి బిల్డింగ్ కట్టించు జగన్ అంటూ పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీంతో ఈ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ విషయంపై పలువురు విభిన్న శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -