Samantha-Mahesh Babu: మహేష్ బాబును విమర్శించి పరువు తీసుకున్న సమంత.. ఏం జరిగిందంటే?

Samantha-Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె ప్రస్తుతం ఏడాది పాటు సినిమాలకు విరామం ఇవ్వబోతున్నానంటూ ప్రకటించారు.ఇలా కెరియర్ పరంగా బిజీగా ఉన్నటువంటి సమంత ఇండస్ట్రీకి దూరమవుతుండడంతో అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు.

 

ఇకపోతే సమంత గతంలో చేసిన ఒక ట్వీట్ కారణంగా ప్రస్తుతం మహేష్ అభిమానులు సమంతను భారీగా ట్రోల్ చేస్తున్నారు.కర్మ తిరిగి వెనక్కి వచ్చిందని కొందరు కామెంట్లు చేయగా మరికొందరు అప్పుడు తప్పు అని ఎత్తి చూపావు మరి ఇప్పుడు నువ్వు చేస్తుంది ఏంటి సమంత అంటూ కామెంట్ చేస్తున్నారు.ఇంతకీ మహేష్ అభిమానులు సమంతపై ఇలా ఫైర్ అవ్వడానికి గల కారణం ఏంటి ఆమె ఏ విధమైనటువంటి ట్వీట్ చేసింది అనే విషయానికి వస్తే…

మహేష్ బాబు కృతి సనన్ జంటగా నటించిన నెంబర్ వన్ నేనొక్కడినే సినిమాలోని టైటిల్ సాంగ్ లో భాగంగా మహేష్ బాబు సముద్ర తీరాన నడుస్తూ ఉండగా కృతి సనన్ మహేష్ బాబు అడుగును తాకుతూ వెళ్తుంది. ఇక ఈ ఫోటోని సమంత సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ..ఇప్పుడే ఇంకా విడుదల కానీ ఓ సినిమా పోస్టర్ చూసాను, అది ఎంత దారుణంగా వుంది అంటే, చెప్పలేనంత అంటూ కామెంట్ చేశారు. మహిళలను పురుషులకు బానిసలుగా చూపిస్తున్నారు అన్న అర్థం వచ్చేలా ఈమె పోస్ట్ చేశారు.

 

ప్రస్తుతం సమంత చేసిన ఈ పోస్ట్ కారణంగా తిరిగి మహేష్ అభిమానులు ప్రస్తుతం ఆమెపై దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు. మరి ఇన్నేళ్ల తర్వాత సమంతపై ట్రోల్ చేయడానికి కారణమేంటి అనే విషయానికి వస్తే తాజాగా ఈమె విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషి సినిమాలో ఒక లిరికల్ సాంగ్ లో భాగంగా విజయ్ దేవరకొండ సోఫాలో పడుకొని ఉండగా సమంత అతని కాళ్ల వద్ద ఉంటుంది అంతేకాకుండా విజయ్ దేవరకొండ తన కాలితో సమంత చేతిని తాకుతారు.

 

ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇప్పుడు నువ్వు చేస్తుంది ఏంటి సమంత అంటూ కామెంట్ చేస్తున్నారు. ఆరోజు తప్పని చెప్పిన నువ్వు ఈరోజు ఎలా చేశావు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ ఫోటో పై మరికొందరు స్పందిస్తూ కర్మ తిరిగి వెనక్కి వచ్చింది అంటూ సమంత పోస్టుపై తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -