NTR: ఇటీవలే నందమూరి ఫ్యామిలీలో తారకరత్న మరణించడంతో ఆ కుటుంబం తీవ్ర శోకంలో మునిగిన సంగతి తెలిసిందే. 39 ఏళ్ల వయసులోనే అనారోగ్య సమస్యతో తారకరత్న మరణించడం అందర్నీ షాక్ కు గురి చేసింది. ఇక ఆయనకు పెళ్లయి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఆయన మరణించిన సమయంలో ఆయన భార్య అలేఖ్య ఎంతలా కన్నీరు మున్నిరయిందో చూసాం.
ఇక తన ముగ్గురిని పిల్లల్ని చూసుకొని.. చాలా బాధపడింది. ఇక అప్పటినుంచి నందమూరి ఫ్యామిలీ ఆమెకు, ఆమె పిల్లలకు ధైర్యంగా నిలబడుతున్నారు. ఇక బాలయ్య తారకరత్న భార్య పిల్లల బాధ్యతలు తానే చూసుకుంటున్నాను అని మాట కూడా ఇచ్చాడు. అయితే తాజాగా ఎన్టీఆర్ కూడా తన అన్న కుటుంబానికి సహాయం చేయటానికి ముందుకు వచ్చాడు.
ఆయన చేసిన సహాయానికి తారకరత్న పిల్లలు చేతులెత్తి మొక్కినట్లు తెలుస్తుంది. ఇక అలేఖ్య ఏకంగా ఎన్టీఆర్ కాళ్లు పట్టుకుపోయిందని తెలిసింది. ఇంతకూ ఎన్టీఆర్ ఏం చేశాడంటే.. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత పలు సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈయన పారితోషకం రూ.100 కోట్లకు చేరుకుంది. అయితే ఇప్పుడు తను చేయబోయే సినిమాకు వచ్చే రూ.100 కోట్ల పారితోషకమును తారకరత్న భార్య అలేఖ్యకు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.
ఇక ఈ విషయం తెలిసే అలేఖ్య, తారకరత్న పిల్లలు ఆయనకు చేతులెత్తి మొక్కారని తెలుస్తుంది. ఇక ఈ విషయం ప్రస్తుతం టాలీవుడ్ లో తెలియడంతో అందరూ ఎన్టీఆర్ గొప్పతనం ను పొగుడుతున్నారు. అంతేకాకుండా బాలయ్య కూడా తారకరత్న భార్య, పిల్లల బాధ్యతలు తీసుకోవడంతో.. బాలయ్య కూడా మంచి మనసున్న వ్యక్తి అని అంటున్నారు.