Alekhya Reddy: టాలీవుడ్ హీరో నందమూరి తారకరత్న ఇటీవలె వలే ఫిబ్రవరి 18వ తేదీన మహాశివరాత్రి పండుగ రోజు తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. టీడీపీ నారా లోకేష్ ప్రారంభించిన యువగలం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న మొదటి రోజే ఊహించని విధంగా గుండెపోటు కారణంగా పడిపోవడంతో వెంటనే ఆయనను బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ దాదాపుగా 23 రోజులపాటు మృత్యువుతో పోరాడి చివరికి మృత్యువు ముందు తల వంచాల్సి వచ్చింది. ఆనందంగా తిరిగి వస్తాడు అనుకున్న తారకరత్న ఊహించిన విధంగా అనంత లోకాలకు వెళ్లిపోయాడు.
తారకరత్న మరణ వార్తను ఇప్పటికీ అభిమానులు ఆయన కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. అదంతా ఒక కల అయితే బాగుంటుంది అని అనుకుంటున్నారు. మరి ముఖ్యంగా తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి తన భర్త మరణ వార్తను జీవించుకోలేకపోతోంది. అంతే కాకుండా ఆమె ఆ విషాదం నుంచి బయటపడలేకపోతోంది. ఇక ఇది ఇలా ఉంటే తారతరత్న మరణించిన తర్వాత ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేసింది.
అదేమిటంటే తారకరత్న పెద్ద కూతురు నిషిక తారకరత్న అలేఖ్య రెడ్డిల కూతురు కాదని ముందు భర్త సందీప్ రెడ్డి కూతురు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. కానీ ఆ వార్తలు అన్నీ కూడా అవాస్తవమే. ఎందుకంటే నిషిక తారకరత్న అలేఖ్యల కూతురే. అయితే చాలామందికి ఎందుకు అనుమానం వచ్చింది అన్న విషయంలోకి వెళితే తారకరత్న కొడుకు, నిషిక ల మధ్య చాలా ఏజ్ గ్యాప్ ఉండడంతో నిషిక సందీప్ రెడ్డికి పుట్టిందని చాలామంది అభిప్రాయపడ్డారు. అందుకే నందమూరి కుటుంబం తారకరత్న దూరం పెట్టింది అనుకున్నారు. కానీ ఆ వార్తలు అన్నీ కూడా అవస్తవాలే.