Pushpa2: పుష్పతో పోటీ పడటానికి రంగంలోకి దిగబోతున్న గోపి చంద్?

Pushpa2: టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమా గతేడాది విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ మాస్ లుక్, అల్లు అర్జున్ నటన అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాకుండ హిందీ ప్రేక్షకులని మరింత ఆకట్టుకుంది. ఈ సినిమాలో పుష్పరాజ్ యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ కూడా బాగా ఫేమస్ అయ్యింది.

చిన్న పిల్లల దగ్గర ఇంటర్నేషనల్ స్టార్స్ వరకూ అందరూ పుష్ప స్టైల్ ని ఫాలో అవుతున్నారు. ఈ సినిమా మంచి హిట్ అవడంతో అందరూ పుష్ప 2 కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో రష్మిక నటన కూడా అద్భుతంగా ఉంది. అనసూయ, సునీల్, రావు రమేష్, ఫహద్ ఫాజిల్ వంటి తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు. ఇక పుష్ప 2 సినిమాలో ఫాహద్ ఫాజిల్ మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడని అందరు భావిస్తున్నారు. మలయాళ హీరో అయిన ఫాహద్ ఫాజీల్ పుష్పలో విలన్ గా నటించి మెప్పించాడు. కానీ పుష్ప 2 లో ఫాహద్ ఫాజీల్ కాకుండా మరొక ప్రధాన విలన్ సినీ పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

పుష్ప మొదటి భాగంలో ఫహద్, సునీల్, ధనుంజయ విలన్స్ గా ఉన్నారు. అయితే.. సిండికేట్ విషయంలో బన్నీకి అండగా నిలిచిన ఎంపీ రావురమేష్ కి పైస్థానంలో ఉండే ఓ రాజకీయ నాయకుడి పాత్రతో కొత్త విలన్ ని ప్రవేశపెట్టే ఆలోచనలో సుకుమార్ ఉన్నట్టు సమాచారం. అయితే ఆ పవర్ ఫుల్ పొలిటిషన్ పాత్రకోసం నటుడు ఆది పినిశెట్టి పేరు ప్రస్తావనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ క్రమంలో పుష్ప సీక్వెల్ కి కొత్త విలన్ గా ఆది పినిశెట్టి కాకుండా.. మరొక టాలివుడ్ హీరో అయితే ఆ పాత్రకి న్యాయం జరుగుతుందని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారట.

ఇంతకీ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్న ఆ హీరో ఎవరో కాదు మ్యాచో హీరో గోపీచంద్ . జయం, వర్షం వంటి బ్లాక్ బస్టర్ సినిమాలలో విలన్ గా నటించిన గోపీచంద్ ఆ పాత్రకి బాగా సెట్ అయ్యాడు. అందువల్ల పుష్ప 2 సినిమాలో మెయిన్ విలన్ పాత్రకి గోపీచంద్ అయితే ఆ పాత్ర నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. మరి ఈ సినిమాలో విలన్ పాత్రకి ఎవరు ఓకే అవుతారో పుష్ప టీమ్ ప్రకటించాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -