Nagendra Babu: హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలతో పాటు రాజకీయాలలో కూడా రాణించటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని స్థాపించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రజల మధ్య తిరుగుతూ వారి కష్టనష్టాల గురించి తెలుసుకుంటూ తన వంతు సహాయం చేస్తున్నాడు.
అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పరిపాలన విషయంలో జరుగుతున్న తప్పుల గురించి కూడా ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ఆయన సోదరుడు నాగబాబు కూడా రాజకీయాలలో రాణిస్తున్నాడు. తాజాగా జన సేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన నాగబాబు సోషల్ మీడియాను దారిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా అన్ని జిల్లాల్లోని పార్టీ నేతల, కార్యకర్తలతో పాటు సోషల్ మీడియా జనసైనికులతోనూ మంతనాలు జరుపుతున్నాడు. పార్టీ బలోపేతం.. నేతల మధ్యనున్న గ్యాప్.. స్థానికంగా ఉన్న సమస్యలపై వర్చువల్ సమావేశాల్లో చర్చిస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా టీంకు .. ఆయన చాలా సూచనలు చేస్తున్నారని సమాచారం.
సోషల్ మీడియాలో అధికార పార్టీ గురించి జన సైనికులు తరచూ విమర్శలు చేస్తున్నారు.
అధికార పార్టీ నేతలను తిట్టడమే పనిగా జనసైనికుల ప్రవర్తిస్తున్నారు. దీంతో పార్టీ లైన్ ప్రకారం సోషల్ మీడియాలో జన సైనికులు హద్దులు దాటకుండ ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పవన్.. జనసైనికులకు కొన్ని ప్రత్యేకమైన సూచనలు చేశారు. కారణం ఏదైనా… నాగబాబు ముందుగా వర్చువల్ మీటింగ్ ల ద్వారా పార్టీలో ఉన్న లోపాలను సవరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా నాగబాబు పార్టీ కోసం కోసం చేస్తున్న ఈ పనులన్నీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ కు తప్పకుండా విజయం వరిస్తుందని తెలుస్తుంది.