Chiranjeevi Meher Ramesh: చిరంజీవిని మెహర్ రమేష్ ముంచుతాడో.. తేల్చుతాడో.. ఇంతమంది కెరీర్ డిసైడ్ కానుందా?

Chiranjeevi Meher Ramesh: మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి తమన్నా కలిసి నటిస్తున్న తాజా చిత్రం భోళాశంకర్. ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు. మెగా అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే అంతా బాగానే ఉంది కానీ దర్శకుడు మెహర్ రమేష్ విషయంలో భయపడుతున్నారు. ఎందుకంటే దాదాపు పదేళ్ల తరువాత దర్శకుడు మెహర్ రమేష్ అందిస్తున్న సినిమా ఇది. శక్తి, షాడో సినిమాలు ఇచ్చిన నెగిటివ్ ఫలితాల కారణంగా మెహర్ రమేష్‌కు చేతిలోకి సినిమాలు రాలేదు.

ఇన్నేళ్ల తరువాత సినిమా దొరికింది. అది కూడ రీమేక్. మెగాస్టార్ లాంటి హీరో, భారీ ప్రొడక్షన్ సంస్థ. దేనికీ లోటు లేదు. అందువల్ల ఇక ప్రూవ్ చేసుకోవాల్సింది తన స్టామినా మాత్రమే. అలా ప్రూవ్ చేసుకుంటేనే టాలీవుడ్‌లో మెహర్ రమేష్‌కు కంటిన్యూటీ వుండడానికి అవకాశం వుంటుంది. లేదంటే కష్టం అవుతుంది. అయితే నిర్మాత అనిల్ సుంకర. ఇటీవల అందించిన భారీ ప్రాజెక్ట్ ఏజెంట్ బాక్సాఫీస్ దగ్గర గట్టిగా ఫెయిల అయింది. నిర్మాతగా ఆయన కొంత నష్టపోయారు. బయ్యర్లు అయితే దారుణంగా కుదలేయిపోయారు. ఇప్పుడు ఈ సినిమా కచ్చితంగా హిట్ కొట్టాలి. లేదంటే బయ్యర్లు మళ్లీ మరోసారి దెబ్బతినే ప్రమాదం వుందది..

 

ఇప్పటికే ఏజెంట్ వల్ల కొందరు బయ్యర్లు మళ్లీ ఇప్పట్లో కోలుకోలేని స్థితి, ఆస్తులు అమ్ముకునే స్థితికి చేరుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా కూడా అలా ఝలక్ ఇస్తే భవిష్యత్‌లో అనిల్ సుంకర భారీ సినిమాలు నిర్మించి మార్కెట్ చేయడం కష్టం అవుతుంది. ఆచార్య సినిమా తర్వాత మెగాస్టార్ వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇప్పుడు మరోసారి ఈ సినిమా ఫెయిల్ అయితే మాత్రం కెరియర్ కాస్త కష్టమే చెప్పవచ్చు. మరోవైపు హీరోయిన్ తమన్నా కూడా సినిమా అవకాశాలను అందుకుంటు దూసుకుపోతోంది. ఒకవేళ ఈ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం అది ఆమె కెరియర్ పై కూడా కాస్త దెబ్బ పుడుతుంది అని చెప్పవచ్చు. మొత్తానికి దర్శకుడు మోహన్ రమేష్ చిరంజీవిని ముంచుతాడో? తేల్చితాడో తెలియాలి అంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -