Niharika Konidela: ఆరోజే నిహారిక విడాకుల గురించి ప్రకటన చేస్తారా?

Niharika Konidela: మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మెగా వారసత్వాన్ని అందుకునీ ఈమె బుల్లి తెర యాంకర్ గా తన ప్రయాణం మొదలు పెట్టారు.ఇలా యాంకర్ గా తన కెరియర్ ప్రారంభించిన నిహారిక అనంతరం హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇచ్చారు.ఇలా హీరోయిన్ గా పలు సినిమాలలో నటించిన నిహారికకు పెద్దగా సక్సెస్ రాలేదని చెప్పాలి.మెగా ఆడపడుచు ఇలా హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి రావడాన్ని జీర్ణించుకోలేని అభిమానులే తనని సక్సెస్ చేయలేకపోయారు.

ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్ గా సక్సెస్ కాకపోవడంతో ఈమె తన కుటుంబ సభ్యులు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు. ఇలా 2020వ సంవత్సరంలో రాజస్థాన్ కోటలో నిహారిక జొన్నలగడ్డ వెంకట చైతన్య వివాహం ఎంతో అంగరంగ వైభవంగా మూడు రోజుల పాటు జరిగింది. ఇలా వీరి వివాహం చేసుకున్న తర్వాత కొత్త జీవితంలో ఎంతో సంతోషంగా గడిపారు.పెళ్లి అయినప్పటికీ నిహారికకు సినిమాలపై పిచ్చి తగ్గకపోవడంతో నిర్మాతగా మారిపోయారు.

నిహారిక పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్స్ స్థాపించి పలు వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ నిర్మాతగా మారారు ఇందుకు ఈమె భర్త సహకారం కూడా లభించింది.అయితే నిర్మాతగా కొనసాగుతున్న నిహారికకు తన భర్త చైతన్యకు మధ్య మనస్పర్ధలు తలెత్తినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వార్తలకు అనుగుణంగానే వీరిద్దరూ దూరంగా ఉండటమే కాకుండా ఇద్దరు కూడా సోషల్ మీడియాలో తమ పెళ్లి ఫోటోలను డిలీట్ చేశారు.

ఇలా పెళ్లి ఫోటోలు కూడా డిలీట్ కావడంతో నిహారిక చైతన్య విడిపోతున్నారనే వార్తలకు బలం చేకూరింది. ఇక ఈ వార్తలు వైరల్ అవుతున్నప్పటికీ మెగా ఫ్యామిలీ కానీ లేదా చైతన్య ఫ్యామిలీ కానీ ఈ విషయం గురించి స్పందించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు.
ఇలా నిహారిక గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విడాకుల వార్తలు వైరల్ కావడంతో నిహారిక ఓ మంచి సమయం చూసుకొని ఈ విషయం గురించి ప్రకటించబోతున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే నిహారిక మే నెల 22వ తేదీన విడాకుల గురించి ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. మరి ఆ రోజున ఈమె ఎలాంటి న్యూస్ చెప్పబోతారో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -