Sharmila: షర్మిల కోరుకున్నది ఎప్పటికీ దక్కే ఛాన్స్ లేదా.. రాజకీయాల్లోకి వచ్చి అతిపెద్ద తప్పు చేసిందా?

Sharmila: వైసీపీ పార్టీని తెలంగాణలో ప్రారంభించి తన తండ్రి ఆశయాలను నెరవేర్చాలి అన్న షర్మిల కల ప్రస్తుత పరిస్థితి అలాగే భవిష్యత్తు కూడా అగమ్య గోచరంగా మారింది. తన సొంత పార్టీ ద్వారానే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో పోటీ చేసే అధికారంలోకి వస్తామని, కెసిఆర్ ను మట్టికరిపిస్తామని ప్రగల్భాలు పలికింది షర్మిల. కానీ కనీసం ఎన్నికల వరకు పార్టీని నడిపే సామర్థ్యం లేక కాంగ్రెసులో విలీనానికి సిద్ధపడింది. ఇప్పటికే రెండుసార్లు ఢిల్లీ పెద్దలతో సమావేశం కూడా అయ్యింది. అయినా ఇప్పటికీ ఆమెకు నిరీక్షణ పర్వం తప్పడం లేదు. సిడబ్ల్యూసి సమావేశాల కోసం, సోనియా రాహుల్ తదితర కాంగ్రెస్ దిగ్గజాలు అందరూ హైదరాబాదుకు వస్తున్న తరుణంలో కనీసం వైయస్ షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం అనే వ్యవహారం ఒక కొలిక్కి వస్తుందా?

లేదంటే ఆమె నిరీక్షణకు తెరపడుతుందా? ఆమె రాజకీయ ప్రస్థానం కోరుకున్న విధంగానే ముందుకు నడుస్తుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. షర్మిల ఆశిస్తున్నట్లుగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ రాజకీయాల్లో అమిక పెద్దపీట వేసి ఆదరించడానికి కాంగ్రెస్ పార్టీ అంత సుముఖంగా లేదని అర్థమవుతోంది. ఏపీ రాజకీయాలలో ఆమె క్రియాశీల పాత్రను కాంగ్రెస్ కోరుకుంటోంది. ఆ విషయంపై ఆమె ఎటూ నిర్ణయించుకోలేకపోతున్నారని తెలుస్తోంది. అయితే కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపడం ద్వారా ఆమెకు ఎంపీ హోదా కట్టబెట్టడానికి కాంగ్రెస్ అంగీకరించినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలలో ఆమె వేలు పెట్టడానికి ఇక్కడి సీనియర్లు అనేకమంది విముఖంగా ఉన్నారు..

ఇప్పుడున్న పరిస్థితులు, మారుతున్న సమీకరణాల నేపథ్యంలో ఆమె నిన్నటిదాకా కోరుకున్న ఖమ్మం జిల్లాలోని పాలేరు ఎమ్మెల్యే స్థానాన్ని ఆమె కేటాయించడం కూడా కష్టసాధ్యమే. అలాంటప్పుడు తనకు ఏం దక్కుతుందని స్పష్టత లేకుండా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించి కొన్ని సంవత్సరాల పాటుపడిన కష్టాన్ని గంగలో కలిపేయడానికి, కాంగ్రెస్లో విలీనం కావడానికి షర్మిల సిద్ధమేనా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అందుకు మించి ఆమె ముందు ప్రస్తుతం వేరే ప్రత్యామ్నాయాలు కూడా లేవని పలువురు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిడబ్ల్యుసి సమావేశాలు ముగిసే సమయానికి.. షర్మిల నిరీక్షణ పర్వం కూడా ముగుస్తుందని పలువురు అంటున్నారు..

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -