మహి వి రాఘవ్ డైరెక్షన్ లో తెరకెక్కిన యాత్ర మూవీ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైఎస్సార్ అభిమానులను ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుంది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి వైఎస్సార్ పాత్రలో జీవించారు. యాత్ర సినిమా కమర్షియల్ గా కూడా సక్సెస్ సాధించిన నేపథ్యంలో ఈ సినిమాకు సీక్వెల్ గా యాత్ర2 మూవీ తెరకెక్కింది.
సీఎం జగన్ రాజకీయ జీవితానికి సంబంధించిన కీలక అంశాలను ప్రస్తావించడంతో పాటు వైఎస్సార్ మరణం తర్వాత జగన్ కు ఎదురైన ఇబ్బందులను, జగన్ ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం వరకు ఎదిగిన తీరును ఈ సినిమాలో ప్రధానంగా చూపించనున్నారు. యాత్ర2 మూవీ టీజర్ డేట్, టైమ్ ఫిక్స్ అయింది. ఈ నెల 5వ తేదీన ఉదయం 11 గంటలకు ఈ టీజర్ రిలీజ్ కానుంది.
2009 సంవత్సరం నుంచి 2019 సంవత్సరం వరకు వైఎస్ జగన్ జీవితంలో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. మమ్ముట్టి, జీవాలకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేస్తూ చిత్ర యూనిట్ టీజర్ డేట్, టైమ్ ను ప్రకటించింది. ఈ సినిమాలో వైఎస్ భారతి పాత్రలో మరాఠీ నటి కేతకి నారాయణన్ నటించగా అమె లుక్ కూడా ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే.
One man, a million odds, yet the promise had to be kept!#Yatra2Teaser on Jan 5th 👣#LegacyLivesOn #Yatra2 #Yatra2OnFeb8th @mammukka @JiivaOfficial @ShivaMeka @vcelluloidsoffl @KetakiNarayan @Music_Santhosh @madhie1 @suzannebernert @manjrekarmahesh #SelvaKumar @3alproduction pic.twitter.com/BaOoa7bTfs
— Mahi Vraghav (@MahiVraghav) January 2, 2024
యాత్ర2 టీజర్ రిలీజ్ తో ఏపీలోని ప్రతిపక్షాలకు వెన్నులో వణుకు పుడుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏపీ ఎన్నికలకు ముందు విడుదల కానున్న యాత్ర2 సినిమా జగన్ ప్రజల కోసం ఎన్ని త్యాగాలు చేశారో ఎంతమంది రాజకీయ నేతలను ధీటుగా ఎదుర్కొన్నారో మరోసారి ప్రజలకు గుర్తు చేయనుంది. యాత్ర2 సినిమా కోసం సీఎం జగన్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.