YCP MLC Duvvada Srinivas: మరి కొద్ది రోజులలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున రాజకీయ వేడి రాజుకుంది. అయితే తాజాగా వైసిపి నేతలు చేస్తున్నటువంటి అరాచకాలు స్వయంగా వారి వెల్లడిస్తూ చేస్తున్నటువంటి కామెంట్లు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రౌడీయిజం చేసే మేము ఎన్నికలలో గెలిచామని, రౌడీయిజం చేస్తేనే తమకు పదవులు వచ్చాయి అంటూ తాజాగా వైకాపా నేతలు చేసినటువంటి వ్యాఖ్యలు బయటపడటంతో ఈ వ్యాఖ్యలు కాస్త సంచలనంగా మారాయి.
వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ రౌడీయిజం చేసి మేము స్థానిక ఎన్నికలలో గెలిచామంటూ గతంలో తన అనుచరుల వద్ద చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. దువ్వాడ శ్రీనివాస్ తన అనుచరుల వద్ద మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికలలో టెక్కలి నియోజకవర్గం లో 55 స్థానాలు సర్పంచ్ ఎన్నికలలో వైకాపా మద్దతు దారులు గెలుస్తారని ఆయన గతంలో వెల్లడించారు. మిగిలినవన్నీ టిడిపి సొంతం చేసుకుంటుందని తెలిసి ఏం చేయాలని ఆలోచనలో పడ్డాము.
నిమ్మాడలో మాకు మద్దతిచ్చే కింజారపు అప్పన్న సర్పంచ్ అభ్యర్థిగా నామినేట్ వేయకుండా తెదేపా వాళ్ళు అడ్డుపడుతున్నారని తెలిసి ఆ గ్రామం పై దాడి చేసి తన చేత నామినేషన్ వేయించామని తెలిపారు. ఇక నన్ని తెదేపా అధినేత అచ్చం నాయుడు కొట్టారని అతనిపై కేసు పెట్టి తనని జైలుకు పంపించాము ఆయన కార్యకర్తలు బయటకు రాకుండా చేసేసాము. ఇలా పలు ప్రాంతాలలో తెదేపా నాయకులపై రౌడీ షీట్ కేసులు పెట్టించే వారిని జైలుకు పంపించడం హౌస్ అరెస్టు చేయడం చేపించాము.
ఈ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు బయటకు రాకుండా ఎక్కడికక్కడ వారిని అరెస్టులు చేయించి స్థానిక ఎన్నికలలో ఎంపీటీసీ జడ్పిటిసి స్థానాలలో భారీగా మెజారిటీ సాధించామని రౌడీయిజం చేస్తేనే ఈ స్థానాలలో మేము గెలిచాము అంటూ దువ్వాడ శ్రీనివాస గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. తాను అలా రౌడీయిజం చేయించి ఉంటేనే ముఖ్యమంత్రి నాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని ఈయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.